బీజేపీ అధికార దాహానికి మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిపోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతల అస్త్రంగా వాడుకొని బీజేపీ చక్రం తిప్పుతున్నది. ఈ ఏడాది మార్చి నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతి రాధిత్య సింధియా తన వర్గీయులతో తిరుగుబాటు చేసి బీజేపీ పంచన చేరిపోవడంతో సీఎం కమలనాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోవడం అనంతరం బీజేపీ కేంద్ర నాయకత్వం ఆశీస్సులతో శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎత్తులకు 15 నెలల కాలానికే కమలనాథ్ ప్రభుత్వం కూలిపోయింది.
ఇప్పుడు తాజాగా ఆ పరిస్థితి రాజస్థాన్ కు వచ్చింది. ఇక్కడ అశోక్ గెహ్లట్ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ద్వారా ముసలం పుట్టింది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని, ఒక్కో ఎమ్మెల్యే కి 15కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తోందని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర రాజకీయం ఢిల్లీకి చేరింది. గెహ్లట్ పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సచిన్ పైలట్ తన మద్దతు దారులైన ఎమ్మెల్యే తో శనివారం రాత్రే ఢిల్లీకి చేరారు. ఏ క్షణంలోనైనా సచిన్ పైలట్ తో సహా 25మంది ఎమ్మెల్యే లు బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాజస్థాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 101. 119 మంది ఎమ్మెల్యేతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా నిలవగా అశోక్ గెహ్లట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. సీపీఎం కు ఇద్దరు, బీటీపీ కి ఇద్దరు, ఆర్ఎల్డి కి ఒకరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే లు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి అన్ని తానే అయి వ్యవహారాలు నడిపిన సచిన్ పైలట్ తన వర్గీయులతో తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో గెహ్లాట్ కుర్చీ కదిలే పరిస్థితి నెలకొన్నది.
కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పెద్దల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోందని వార్తలు వస్తుండగా బిజెపి వ్యూహానికి ప్రతి వ్యూహం కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో సీఎం గెహ్లట్ సమావేశం అయ్యారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?