బీజేపీ అంటే వ్యవస్థలను శాసిస్తున్న ఓ వ్యవస్థ. రాజ్యాంగాన్ని, రాజులను ఎప్పుడైనా మార్చేయగల ఓ అతీత శక్తి.. నీతి/ నిజాయితీ/ అన్యాయం/ న్యాయం/ చట్టం/ ధర్మం అనేవి ఏమి పట్టవు. ఓటు/ సీటు/ కుర్చీ తప్ప ఇంకేం కనిపించవు. మధ్యప్రదేశ్ గెలిచామా..? బీహార్ గెలిచామా..? తర్వాత బెంగాల్ లో గెలిచామా..? అనేవే లక్ష్యాలు. మోడీ/ షా ద్వయం కుర్చీలు కదలకుండా.. వారు కూర్చున్న కుర్చీల నుండి కదలకుండా దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. అటువంటి పార్టీకి పాపం ఏపీలో ఓట్లు, సీట్లు రావడం లేదు. ఎందుకొస్తాయిలే ఇక్కడ మరీ ఇలా సిల్లీ ట్రిక్స్ ప్లే చేస్తే..!!
ఏమిటండీ ఈ బీజేపీ..!? ఇలాగే రాజకీయం చేస్తే ఏపీలో ఆ ఒక్క శాతం కూడా పోతాయేమో..!?
ఎవరండీ ఈ సోము..!? ఎవరండీ ఈ బండి..!? ఇలాగే చేస్తే ఆ కొద్దిమంది కూడా దూరమవుతారేమో..!? ఆ కొద్ది ఓట్లు కూడా రాలవేమో..!? ఇదీ బీజేపీ/మోడీకి ఏపీలో ఉన్న కొద్ది మంది అభిమానుల ఆందోళన..!
కన్నా టీడీపీకి అనుకూలం, వైసీపీకి వ్యతిరేకమైపోయారని… సోముని తీసుకొస్తే ఈయన అసలైన వైసీపీ వాది కంటే కరుడుకట్టిన వైసీపీ వాదిలా మాట్లాడేస్తున్నారు. ఏవో లాలూచీలు, స్నేహాలు, బంధాలు ఉంటె లోలోపల చూసుకోవాలి. కానీ ఇలా సులువుగా.., మరీ ఈజీగా దొరికిపోయేలా మాట్లాడేస్తే ఎలా..!? ఇక్కడ సోము ఇలా ఉంటె.. అక్కడ బండి మరోలా భయానక రాజకీయాలు చేస్తున్నారు.
లేఖ ఇచ్చింది మీరే..? మళ్ళీ ప్రశ్నిస్తున్నది మీరే..!?
స్థానిక ఎన్నికల విషయంలో బీజేపీ వైఖరి ఏమిటన్నది గత నెల స్పష్టమైంది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతనెల 28 న రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోము తరపున ఆ పార్టీ ప్రతినిధిగా పాకా సత్యన్నారాయణ పాల్గొన్నారు. “వైసిపి నేతలు మా కార్యకర్తల చేతులు నరికారు. హత్యాయత్నం చేసారు. ఆనాడు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానిక స్వపరిపాలనకు బీజేపీ పూర్తి అనుకూలం. తగు నిర్ణయం తీసుకోవాలి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి” అంటూ ఓ అధికారిక లేఖని ఇచ్చారు. అంటే “స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమీషన్ తీసుకునే నిర్ణయానికి మాకు అభ్యంతరం లేదు.., అధికార వైసిపి గతంలో అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడింది. ఈ సారి అలా కాకుండా చుడండి” అని అచ్చమైన తెలుగులో చెప్పినట్టే..!!
తాజాగా నిన్న ఓ ప్రెస్ మీట్ లో సోము వారు ఏం సెలవిచ్చారంటే..!? “ఏం నిమ్మగడ్డ రాష్ట్రంలో ఎవరు చెప్తే మీరు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు..? ఎవరి డైరెక్షన్ లో మీరు ఎన్నికలు నిర్వహించడానికి అనుకుంటున్నారు..!” అంటూ ప్రశ్నించారు.
బండి కూడా ఇదే తరహాలో..!!
ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, వ్యవస్థని కాపాడాలి అంటూ పెద్ద పెద్ద మాటలతో లేఖ ఇచ్చిన బీజేపీ… తెలంగాణాలో కూడా దొరికిపోయింది. అక్కడ బండి సంజయ్ కూడా గ్రేటర్ లో వరద సాయం నిలిపివేయాలి. గ్రేటర్ ఎన్నికలు దృష్ట్యా సాయం ఇవ్వకుండా అధికార పార్టీని నిలువరించాలి అని లేఖ రాశారు. తద్వారా ప్రజలకు అందుతున్న సాయాన్ని ఆపించేసారు. ఆ తర్వాత రోజునే ఓ బహిరంగ మీటింగ్ లో “గ్రేటర్ లో వరద సాయం కూడా సరిగా ఇవ్వడం లేదు. మేము ఆపేయమన్నాం అని చెప్తున్నారు. మీకు సాయం ఇస్తే మేము ఎందుకు ఆపుతాం. మాకు ఓటేయండి. పాతిక వేలు సాయం ఇస్తాం” అంటూ హామీలిచ్చారు. అంటే దొడ్డిదారిన లేఖలిచ్చేసి.. ముందుకొచ్చి సవాల్ చేసినట్టు ఉంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ చీకటి వ్యవహారం ఇలా ఉంది. తెలంగాణాలో అంటే మరీ పెద్ద విషయాలేమి కాదు. అక్కడ జనం ఇవేమి పట్టించుకోరు. కానీ ఏపీ అలా కాదు. ప్రతీది పట్టించుకుంటుంది. ప్రతీ అడుగు చూస్తుంది. సోములా షేమ్ పనులు చేస్తే.., సులువుగా దొరికిపోయేలా సిల్లర పనులు చేస్తే.., పార్టీ గురించి చెప్పుకోడానికి “ఒకప్పుడు” అనే పదాలు వాడాల్సి వస్తుంది..!!