అమరావతి: ప్రధాని మోదిని గంటకు ఒక డ్రస్ మారుస్తారు అంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘మోది గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదు గానీ, నువ్వు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్. నిమిషానికి ఒక మాట మారుస్తావ్. నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్. ఎమ్మెల్యేలను కొని వాళ్ల పార్టీ మారుస్తావ్. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో నీ సీట్ మారుస్తున్నారు.’ అంటూ ఘాటుగా కన్నా విమర్శలు చేశారు.
కాగా బిజెపి నాయకుడిగా మారిన మాజీ సీనియర్ ఐఎఎస్ అధికారి ఐవిఆర్ కృష్ణారావు కూడా చంద్రబాబుపై మరో మారు విమర్శలు చేశారు. విపక్ష నేతలా సీఎస్ వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన విమర్శలకు ఐవైఆర్ ట్విట్టర్ వేదిగా స్పందించారు
‘ప్రధాన మంత్రితో ఢీ కొట్టాల్సిన స్థాయిలో ఉన్న నేత సిఎస్తో ఢీ కొట్టాలని చూడటం దురదృష్టకరం ఆయన ఒక సాధారణ అధికారి. తన ప్రమేయం లేకుండా సిఎస్ నియామకాన్ని ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రాక్ రికార్డు చూడాలంటే అందరు రాజకీయ నాయకుల రికార్డులు, అధికారుల రికార్డులు చూస్తే బాగానే ఉంటుంది’ అని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్కు సెటైర్ వేశారు. ‘విపత్తులు వచ్చినా ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలని నిబంధనల్లో ఉందా? ఈసితో తాడో పేడో తేల్చుకుంటా, మేం ఏమైనా ఉత్సవ విగ్రహాలమా?’ అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలపై ఐవిఆర్ ట్విట్టర్ వేదికగా ‘మంచిది. ఆ తాడోపేడో ఈసితో త్వరగా తేల్చేసుకుంటే మాకీ కంఠశోష రోజు టీవిలో వినాల్సిన పేపర్లో చదవాల్సిన బాధ తప్పుతుంది‘ అంటూ సెటైర్ వేశారు.
మోదీ గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదుగానీ..
నువ్వు మాత్రం
ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్.
నిమిషానికి ఒక మాట మారుస్తావ్.
నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్.
ఎమ్మెల్యేలను కొని వాళ్ళ పార్టీ మారుస్తావ్.అందుకే ప్రజలు ఈ ఎన్నికలలో నీ సీట్ మారుస్తున్నారు. @ncbn pic.twitter.com/sVV0SWrC6E
— Kanna Lakshmi Narayana (@klnbjp) May 2, 2019