ఏపీలో బీజేపీ రోజురోజుకి పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. సోము వీర్రాజు అధ్యక్షుడైన తరువాత గతంలో కంటే భిన్నంగా బిజెపి పార్టీ పేరు వినబడుతుంది. చాలా సందర్భాలలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ఎక్కువగా బిజెపి యే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయంలో ముందుండి రాణించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దూకుడుగా అధ్యక్షుడు సోము వీర్రాజు టిడిపి పార్టీ ని టార్గెట్ చేస్తూ… చాలావరకు ఏపీలో ఇక రెండో స్థానం బీజేపీ ఉండేలా వ్యవహరిస్తూ మొన్నటి దాకా వచ్చారు.
అదే సమయంలో చాలా మంది టీడీపీ నేతలను పార్టీలోకి వచ్చేలా సోము వీర్రాజు వ్యవహరించినట్లు మొన్నటి దాకా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సోము అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో ఇష్టానుసారంగా హైకమాండ్ కి వ్యతిరేకంగా మాట్లాడే వారికి చెక్ పెడుతూ రావడం జరిగింది. ఇలా అన్ని విధాలా బీజేపీని బలోపేతం చేస్తున్న సోము వీర్రాజు తాజాగా వైసీపీ పార్టీ నాయకులను కూడా బీజేపీ లోకి వచ్చేలా సరికొత్త స్కెచ్ వేసినట్లు సమాచారం.
దీంతో పార్టీలో అసహనంగా వున్న నాయకులను టార్గెట్ చేసుకుని… వారిని బీజేపీలో చేర్చుకునే పనిలో సోము వీర్రాజు ఆలోచన చేస్తున్నట్లు టాక్. దీనిలో భాగంగా గుంటూరు ప్రాంతానికి చెందిన కీలక నాయకుడు ఫైర్ బ్రాండ్ గా పార్టీలో ఉన్నా వైసిపి నేత ని తీసుకురావటానికి ఏపీ బీజేపీ కీలక నేతలు ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆ నేత సోము వీర్రాజు తో మాట్లాడినట్లు… త్వరలోనే బిజెపి పార్టీలోకి వచ్చే రాదో విషయాన్ని ఆ వైస్సార్సీపీ నేత చెప్పనున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తోంది.