ఎప్పటి నుండో అనుకుంటున్నది ఇప్పటికి సాధ్యపడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్ల ముద్రణ ను రద్దు చేసింది. డిమానిటైజేషన్ లో భాగంగా ముద్రించబడిన రెండు వేల రూపాయల నోట్ల అవసరం చివరికి తీరిపోయినట్లే లెక్క.
ఇకనుండి కేవలం 500 రూపాయలు, రెండు వందల రూపాయలు, వంద రూపాయలు మాత్రమే పెద్ద నోట్ల రూపంలో మనకు కొత్తవి లభిస్తాయి. ఇక రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం ఆపివేస్తారు అని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నా నేటికీ అది సాధ్యపడింది.
ఇదిలా ఉండగా రెండు వేల రూపాయల నోటు ముద్రణ మాత్రమే రద్దు అయిందని… దాని చెల్లుబాటు మాత్రం ఆసాంతం కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ముద్రణను నెలిపివేసినంత మాత్రాన 2000 రూపాయల నోటు చెల్లుబాటు కాకుండా పోదని తెలియజెసింది.