శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో ఒక అవాంఛిత ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి యూనిట్లో ఒక్కసారిగా 4 ప్యానెల్స్ దెబ్బతిని మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికి పది మంది బయటకు రాగా…. తొమ్మిది మంది లోపల చిక్కుకొని ఉన్నారు. లోపల దట్టమైన పొగ అల్లుకొని ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించి మూడుసార్లు లోనికి వెళ్లి మరలా తిరిగి బయటకు వచ్చేశారు. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్ళిన్నా…. సంఘటన స్థలం వద్దకు వెళ్లలేకపోతున్నారు. ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది లోనికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
టీఎస్ జెన్కో విద్యుత్ కేంద్రంలో జరిగిన ఈ ప్రమాదం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మంటలు ఎగిసిపడ్డాయి. ప్యానెల్ బోర్డు లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.