Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నట్టు ముందు తేలిపోతుంది. మరోపక్క విశాఖ లో ఉన్న కార్మిక సంఘాలు మరియు ప్రధాన పార్టీల రాజకీయ నేతలు ఆందోళనలు నిరసనలు చేపడుతూ ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అఖిలపక్ష నాయకులతో కలసి ప్రధాని మోడీ తో భేటీ అవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గాలని జగన్ లెటర్ కూడా రాయటం అందరికీ తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉండగా ఎక్కడ కూడా కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తప్పుబడుతూ..కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి రెడీ అయ్యారు. ఒక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మాత్రమే కాకుండా రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న సాగు చట్టాల విషయంలో కూడా కేంద్రం వెనక్కి తగ్గాలని..కె ఏ పాల్ ఢిల్లీ లో దీక్ష చేయడానికి పూనుకొన్నారు. మార్చి 21 వ తారీకున పాల్ దీక్షకి రెడీ అవుతున్నట్లు సమాచారం.