తెలుగు రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కువగా ఆ పార్టీలో కమ్మవారికి ప్రాధాన్యత కల్పిస్తారు అనే నానుడి ఉంది. అంతేకాకుండా టీడీపీకి ఎక్కువగా కమ్మవారి సపోర్ట్ ఆర్థికంగా అన్ని విధాలా ఉంటుందని ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపకులు ప్రస్తుతం పార్టీని నడిపించే నాయకులు పార్టీలో కీలక పదవిలో ఉండే వాళ్లు చాలా వరకు ఆ వర్గానికి చెందిన వాళ్లే ఉండటం కూడా గమనార్హం. అటువంటి టిడిపి పార్టీలో ఒక కీలక పదవి కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువనేతకు పగ్గాలు అప్పజెప్ప డానికి చంద్రబాబు సరైన స్కెచ్ వేసినట్లు సమాచారం.
పూర్తి విషయంలోకి వెళ్తే తెలుగు యువత అధ్యక్ష పదవిని జెసి దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డికి ఇవ్వడానికి బాబు గారు ఆలోచిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఈ పదవిలో దేవినేని అవినాష్ ఉండేవారు. అయితే 2019 ఎన్నికలలో గుడివాడ లో టిడిపి పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ ఆ తర్వాత టిడిపి పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరారు. దీంతో ఈ స్థానం ఖాళీ అవటంతో తెలుగు యువత అధ్యక్ష పదవిని చేపట్టడం కోసం చాలామంది మహామహులు టీడీపీ పార్టీలో పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి.
టీడీపీ పార్టీలో ఎప్పటినుండో ఉన్న సీనియర్ నాయకులు తమ వారసులకు ఈ పదవి ఇప్పించడానికి అనేకమంది చంద్రబాబుతో మంతనాలు కూడా జరిపినట్లు టాక్ వచ్చింది. ఇటువంటి తరుణంలో తాజాగా రాయలసీమ ప్రాంతంలో పార్టీ చాలావరకు డౌన్ అయిన నేపథ్యంలో….ఈ పదవిని జేసీ పవన్ రెడ్డి కి అప్పజెప్పే కచ్చితంగా ఆ ప్రాంతంలో టీడీపీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారట. దీంతో త్వరలోనే అనగా వచ్చే దసరాకి జేసీ పవన్ రెడ్డి కి తెలుగుయువత అధ్యక్ష పదవిని చంద్రబాబు కట్టబెట్టడం గ్యారెంటీ అనే టాక్ టిడిపి పార్టీలో గట్టిగా వినపడుతోంది.