Tirupathi By poll : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సత్తా చాటాలని ఎవరికి వారు వ్యూహాలు వేసుకుంటూ ఉన్నారు. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో వచ్చిన ఈ ఉప ఎన్నికలలో గతంలో కంటే భారీ మెజార్టీ సాధించి దేశంలో అందరి చూపు వైసీపీ వైపు ఉండే రీతిలో… ఫుల్ మెజార్టీ సాధించడానికి కీలక నాయకులను రంగంలోకి దింపి జగన్ ఆలోచన చేస్తూన్నారు.
ఇదిలా ఉంటే మరో పక్క ఈ ఉప ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ని పోటీకి దింపడం జరిగింది. జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా రత్నప్రభ నీ ఖరారు చేశారు. అయితే తాజాగా తిరుపతి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి చింతామోహన్ … పోటీ చేయటానికి రెడీ అవుతున్నట్లు ఆ పార్టీ అధిష్టానం ప్రకటన చేసింది. ఏప్రిల్ 17 వ తారీఖున జరగనున్న ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీల నాయకులు ఎవరికి వారు సత్తా చాటడానికి పట్టుదలతో ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?