ఢిల్లీ, ఎప్రిల్ 16: బిఎస్పి అధినేత్రి మాయావతికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఎలక్షన్ కమీషన్ నేటి నుండి రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించవద్దంటూ ఆంక్షలు విధించింది.
ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంగళవారం మాయావతి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. మాయావతి అభ్యర్థనను తోసిపుచ్చింది.