ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న హవా ఓ రేంజ్ లో ఉండేది. వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో
ఓ రేంజ్ లో మీడియా సమావేశాలు పెట్టి తొడగొట్టే రీతిలో డైలాగులు వేస్తూ బుద్ధ వెంకన్న రచ్చరచ్చ చేసేవారు. టిడిపి ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా జగన్ ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే దానికి కౌంటర్ వేయటంలో బుద్ధ వెంకన్న ఎప్పుడు ముందుండేవారు.అటువంటి బుద్ధా వెంకన్న ఇప్పుడు భూతద్దం వేసిన ఎక్కడా కనిపించడం లేదు అని ఏపీ రాజకీయాలలో టాక్. కావాలని పార్టీలో బుద్ధ వెంకన్న ప్రాధాన్యత తగ్గించినట్లు సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.
ఎప్పుడూ మీడియా సమావేశాలు పెట్టి చాలెంజ్ విసురుతూ ఉండే బుద్ధా వెంకన్న… ఉన్న కొద్ది ఇటీవల అసలు కనిపించకపోవటంతో ఆయన గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైసిపి లో ఉండే పెద్దపెద్ద నాయకులు విజయసాయిరెడ్డి ఇలాంటివారిని చెడుగుడు అడ్డుకునే బుద్ధ వెంకన్న… ఉన్న కొద్ది టిడిపి పార్టీలో యాక్టివ్ గా లేకపోవడం ఇప్పుడు చాలా వరకూ సస్పెన్స్ గా మారింది.