దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచిన బిజెపి పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో కూడా విజయం కొనసాగించాలని రెడీ అవుతుంది. ఊహించని విధంగా ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించిన కమలదళం అధిపతి బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికలు జరగకముందే గ్రేటర్ ఎన్నికలలో బిజెపి పార్టీకి 75 డివిజన్లు వస్తాయని సర్వేలో తేలిందని తెలిపారు. తాజా పరిస్థితుల బట్టి ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లకు పైగానే బీజేపీ గెలవడం గ్యారెంటీ అని బిజెపికి తిరుగులేదని చెప్పుకొస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో కేడర్లో మంచి నూతనోత్సాహం నెలకొంది అని, కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని మరియు ఇతర పార్టీలను గ్రేటర్ ఎన్నికలలో పక్కనపెట్టి రీతిలో బిజెపి ముందుకు వెళ్లబోతున్నట్లు ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల వరదల కారణంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత ఆగ్రహం భారీ స్థాయిలో ఉందని, దీంతో కచ్చితంగా బిజెపి గ్రేటర్ ఎన్నికలలో తిరిగి సత్తా చాటడం గ్యారెంటీ అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి పార్టీ అవతరించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ రాజకీయాలు గమనిస్తే ముందునుండి బిజెపి పార్టీకి గ్రౌండ్ లెవెల్ నుండి క్యాడర్ ఉంది. టిఆర్ఎస్ పార్టీ కంటే ముందు నుండే బీజేపీకి హైదరాబాద్ పై కొంత పట్టు ఉంది. దీంతో ప్రస్తుత పరిస్థితులు బట్టి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో బిజెపి సత్తా చాటడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.