ఒకానొక సమయంలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ….జగన్ రాజకీయాల్లోకి రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పై గ్రిప్ సాధించారని తెలిపారు. ఏదైనా తనకి డౌట్ వస్తే వెంటనే వైయస్ రాజశేఖర్ రెడ్డి ని అడిగి తెలుసుకునేవారు అని…. జగన్ మెమరీ పవర్ చాలా సూపర్ అన్నట్టుగా వైయస్ భారతి చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పై అనేక సమస్యల విషయంలో…. వైఎస్ జగన్ బాబు సర్కార్ ని సమస్యకు సంబంధించి కరెక్టు నెంబర్ తో ప్రశ్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి.
కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ మరోసారి తన జ్ఞాపక శక్తితో క్యాబినెట్ మంత్రులకు కంగు తినిపించినట్లు సరికొత్త వార్త ప్రభుత్వ వర్గాలలో వినపడుతోంది. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడడంతో…. చాలా నీళ్లు వృధాగా బంగాళాఖాతంలో కలసి పోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే. వైయస్ జగన్ మొట్టమొదటి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో కృష్ణా నదిపై అవనిగడ్డ దగ్గర రెండు ప్రాజెక్టులు నిర్మించాలని, ఎంత ఖర్చు అయినా పర్లేదని కేబినెట్ లో ఓ మంత్రికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. అదేసమయంలో ఏదైనా డౌట్ ఉంటే సలహాదారుల సూచనలను తీసుకోవాలని కూడా సదరు మంత్రికి జగన్ చెప్పుకోచ్చారట. ఇది చెప్పి దాదాపు ఏడాది పైగా కావడంతో ఈ విషయాన్ని సదరు మంత్రి మర్చిపోయారు.
ఇటీవల కృష్ణ కి వరదలు బాగా రావడంతో నీరు వృధాగా బంగాళాఖాతంలో కి కలిసిపోవడంతో ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో….. కృష్ణా నది పై రెండు ప్రాజెక్టులు విషయం గురించి ఎవరూ ప్రశ్నించకుండానే సదరు మంత్రిని జగన్ ప్రశ్నించారట. ఆ రెండు ప్రాజెక్టుల పనులు ఎక్కడ దాక వచ్చింది అని అడిగేప్పటికీ ఆ మంత్రికి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయిందట. ఆ ఒక్క మంత్రి మాత్రమే కాకుండా క్యాబినెట్ మంత్రులు కూడా…. వైఎస్ జగన్వేసిన ప్రశ్నకు తెగ టెన్షన్ పడ్డారట. అయితే ఈ సందర్భంలో సదరు మంత్రి సార్ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇప్పుడే…. ఆ విషయానికి సంబంధించి పనులు ఎక్కడ దాక వచ్చాయో త్వరలోనే అప్డేట్ ఇస్తానని చెప్పారట. కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రులంతా వైఎస్ జగన్ జ్ఞాపకశక్తికి తెగ ఆశ్చర్య పోయినట్లు సమాచారం.