ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్పై వచ్చిన అవినీతి ఆరోపణలు కు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేయాలి అని ప్రతిపక్ష పార్టీ కాంగ్ర్రెస్ డిమాండ్ చేసింది. 2016 లో జార్ఖండ్ లో జరిగిన “గో సేవా ఆయోగ్” అధ్యక్ష పదివి కోసం అమృత్ చౌహన్ అనే వ్యక్తి అప్పటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంచార్జి అయినా త్రివేంద్ర సింగ్ రావత్ బంధువుల బ్యాంకు ఖాతాలోకి నగదు పంపించారు అని జర్నలిస్ట్ ఉమేష్ శర్మ ఆరోపించారు. ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదు అని త్రివేంద్ర సింగ్ రావత్ బంధువుగా భావిస్తున్న వ్యక్తి ఉమేష్ శర్మ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఉమేష్ శర్మ తన మీద నమోదు అయినా ఎఫ్ఐఆర్ రద్దు చేయాలి అని కోరుతూ ఉత్తరాఖండ్ రాష్ట్ర హై-కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు.
ఈ కేసు పై విచారణ చేపట్టిన హై-కోర్ట్ జర్నలిస్ట్ పై నమోదు అయినా ఎఫ్ఐఆర్ ను కొట్టి వేస్తూ, సీఎం పై వచ్చిన అవినీతి ఆరోపణలు గురించి సరియిన దర్యాప్తు చేపట్టాలి అని సిబిఐ కి ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని, అవినీతిని నిరోధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారు అని కాంగ్రెస్ నాయకులు భాజపా పైన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హై కోర్ట్ నుండి ఇలాంటి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా సీఎం పదవిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదు’ అని కాంగ్రెస్ర రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ బేబి రాణి మౌర్యను కలిసి హైకోర్డు ఆదేశాల మేరకు సమగ్రంగా సీబీఐ దర్యాప్తు జరగాలంటే రావత్ వెంటనే పదవి నుంచి వైదొలగాలని ఈ విషయంలో గవర్నర్గారు జోక్యం చేసుకోవాలని కోరుతామని ప్రీతమ్ సింగ్ అన్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు.