CBI Court: రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ మధ్య ఓ పొలిటికల్ హీరోలా ఫీల్ అయిపోతున్నారు.. రోజూ లైవ్ లు.. ప్రెస్ మీట్లు.. మీడియా కవరేజీలు.. ఓ వర్గం మీడియా ప్రత్యేక కార్యక్రమాలు.. డిబేట్లు నిర్వహిస్తుండడంతో… ఆయన పొలిటికల్ రాజులా ఫీల్ అయిపోతున్నట్టున్నారు.. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది అన్నట్టు.. ఆయన ఏది మాట్లాడితే అదే నిజం అన్నట్టు.. కోర్టులు కూడా ఏవ్ ఫాలో అవుతాయన్నట్టు ప్రవర్తిస్తున్నారు.., మాట్లాడుతున్నారు..! ఈరోజు సీబీఐ కోర్టులో విచారణకు వచ్చిన ఓ పిటిషన్ పై ఆయన విడుదల చేసిన వీడియో అటువంటిదే…
CBI Court: పిటిషన్ ఇలా… కోర్టు ప్రొసీజర్ ఇదే..!!
“11 సీబీఐ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని.. తమ పార్టీ పరువుని కాపాడాలని” కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈ రోజు సీబీఐ కోర్టు విచారించింది. పిటిషనర్ తరపు వాదనలు విని, ఈ నెల 27 కి వాయిదా వేసింది.. సాధారణంగా కోర్టు ప్రొసీజర్లు ప్రకారం ఒక పిటిషన్ విచారణకు స్వీకరించిన తర్వాత ప్రతివాదులకు.. థర్డ్ పార్టీకీ నోటీసులు ఇస్తుంది. కౌంటర్లు దాఖలుకు సమయం ఇస్తుంది. అంటే ఈ రెబల్ ఎంపీ పిటిషన్ లో కూడా అదే జరుగుతుంది. ఈరోజు పిటిషనర్ తరపున వాదనలు ఆలకించిన కోర్టు.. ఈ కేసుని విచారణకు స్వీకరించాలా వద్దా!..? అనేది ఈ నెల 27 న వెల్లడిస్తామని.., ఆ తర్వాత ప్రతివాదులకు నోటీసులిస్తామని చెప్పినట్టు తెలిసింది. కానీ దీనిపై రాజుగారు…
బెయిల్ రద్దు తీర్పు 27 న అంటూ..!!
ఈ రోజు మధ్యాహ్నం ఎంపీ రఘురామ విడుదల చేసిన వీడియో ప్రకారం చూసుకుంటే… “నేను వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. మా లాయర్ గట్టిగా వాదనలు వినిపించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలా ..? వద్దా..? అని ఈ నెల 27 కోర్టు తీర్పు చెప్పేస్తుంది” అని ఆయన చెప్పారు. కానీ ఇది అంత సులువు కాదు. ఒక పిటిషన్ పై విచారణ పూర్తిస్థాయిలో జరగకుండా ఏ కోరుతూ అలా వెంటనే తీర్పు చెప్పేయదు. కానీ ఆ ట్రిపుల్ ఆర్ ఎంపీ గారు మాత్రం… తన సంతోషం కోసం.. తన వర్గం సంతోషం కోసం.. సీఎం జగన్ వ్యతిరేకుల సంతోషం కోసం… ఈ వీడేలా రిలీజ్ చేసినట్టున్నారు..!!