CBI: ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. మొదటిసారి పిటిషన్ దాఖలు చేసిన టైములో టెక్నికల్ తప్పులు ఉండటంతో వెనక్కి పంపిన సీబీఐ కోర్టు తర్వాత తప్పులు సరిదిద్ది రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు.
ఈ క్రమంలో విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం .. కౌంటర్ దాఖలు చేయాలని వైఎస్ జగన్ కి అదేవిధంగా సిబిఐకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కౌంటర్ కి సంబంధించి మరింత టైం కావాలి అని జగన్ అదేవిధంగా సీబీఐ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ల రిక్వెస్ట్ అంగీకరించిన న్యాయస్థానం ఈనెల 26వ తారీకు లోపు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. అంతే కాకుండా ఇదే లాస్ట్ చాన్స్ కౌంటర్ దాఖలు చేయడానికి అంటూ హెచ్చరించింది.