CBI : ఇటీవల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైయస్ జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం అందరికీ తెలిసిందే. దాదాపు పదకొండు చార్జిషీట్లలో జగన్ ఏ1గా ఉన్నా నేపథ్యంలో విచారణ తప్పించుకునే తరహాలో కాలయాపన చేస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని మరియు పార్టీపై ఉన్న గౌరవంతోనే సీబీఐ కోర్టులో తాను పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు.
జగన్ నిర్దోషిగా బయటపడాలనే తన ఉద్దేశం అని, పార్టీపై మరియు ఆయన పై ఉన్న గౌరవం తోనే ఈ రీతిగా వ్యవహరించినట్లు ఢిల్లీలో మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ ని సీబీఐ న్యాయస్థానం రిటర్న్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ బీజేపీ పార్టీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దు అయ్యే అవకాశం ఉందని ఇటీవల వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయడంతో.. జగన్ బెయిల్ పిటిషన్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది.