NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CBI: జగన్ కి సీబీఐ షాక్ తప్పదా..!? ఎల్లుండి ఏం జరగనుంది..!?

CBI:  కోర్టు కేసుల నుండి.. సీబీఐ విచారణ నుండి.. ఎలా తప్పించుకోవాలి.. ఏ కారణాలు చెప్పాలి.. విచారణకు ఏ కారణాలు చెప్పి హాజరుకాకుండా ఉండాలి అని చూస్తున్న వైఎస్ జగన్మోహనరెడ్డికి సీబీఐ నుండి ఇక మీదట అటువంటి అవకాశాలు ఉండవు. జగన్ ఇకపై ఆ ఆలోచన చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే సీబీఐలో దాఖలైన కేసులు ఇప్పుడు టైట్ అయ్యాయి. అదనంగా మరో రెండు చార్జిషీట్లు దాఖలు అయ్యాయి. దానితో పాటు ఈడీలో కేసులు కూడా టైట్ అయ్యాయి. ఇక మీదట విచారణ నుండి తప్పించుకునే అవకాశమే లేదు. కోర్టు విచారణకు హజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై తాజా అప్ డేట్ ఏమిటంటే.. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న కేసులో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఇప్పుడు కొత్త చిక్కులు మొదలైయ్యాయి. అది ఏమిటంటే.. రెండు రోజుల క్రితం వ్యాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో సీబీఐ అదనపు చార్జి షీట్లు దాఖలు చేసింది. వీటిని సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టులు స్వీకరించి అందులో ఉన్న నిందితులకు నోటీసులు ఇచ్చాయి. ఆ నిందితుల్లో ఏ 1గా జగన్మోహనరెడ్డి, ఏ 2 గా విజయసాయి రెడ్డి తో పాటు వాన్ పిక్ లో ప్రధానంగా వైసీపీ ఎంపి మోపిదేవి వెంకట రమణ, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, బ్రహ్మనందరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రకాష్, రిటైర్డ్ ఐఏఎస్ లు శామ్యూల్, మన్ మోహన్ సింగ్ లు ఉండగా వీరందరికీ సీబీఐ నుండి సమన్లు అందాయి. వీరందరు సోమవారం జరగనున్న విచారణకు నేరుగా కోర్టు హజరుకావాల్సి ఉంది. మినహాయింపు కూడా దక్కేలా లేదు.

YS Jagan: Planning Blasting Changes in Party, Government

నిజానికి జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత ఆయన బెయిల్ షరతుల్లో ప్రధానంగా ఉన్న ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హజరు కావాలన్న షరతును ఉల్లంఘిస్తున్నారు. ఆయన సీఎంగా ఉండటం, ప్రత్యేక భద్రత తదితర అంశాలు, పరిపాలనా పరమైన కారణాలు, రాజ్యంగం కల్పించిన హక్కులు వీటన్నింటినీ చూపిస్తూ ప్రతి శుక్రవారం వాయిదాలకు హజరుకావడం లేదు. కానీ ఇప్పుడు తాజాగా దాఖలు చేసిన రెండు చార్జిషీట్లలో కూడా ఏ 1 గా జగన్మోహనరెడ్డి ఉన్నారు కాబట్టి ఈ విచారణను కూడా ఎలాగోలా తప్పించుకోవాలని జగన్మోహనరెడ్డి బృందం చూస్తుంటే వాళ్లను ఎలాగైనా టార్గెట్ చేసి చార్జి షీటులో ఉన్న అభియోగాలను నిరూపించాలని సీబీఐ ప్లాన్ చేస్తోంది. సీబీఐ కోర్టు కూడా ఈ సారి ఊరుకుండే అవకాశం లేదు. ఎందుకంటే ఇది తీవ్రమైన కేసు. వ్యాన్ పిక్ ల్యాండ్స్ దాదాపు 12 సంవత్సరాల నుండి ఎటుకాకుండా పోయాయి. దాదాపు 3 వేల ఎకరాలు ఈడీ, సీబీఐ కేసు కారణంగా ఎటుకాకుండా పోయాయి. ఈ కేసు ఏదో త్వరగా తేల్చేస్తే, దోషులను త్వరగా నిర్ధారిస్తే లేదా ఏ తప్పు లేదని తేల్చేసినా ఫరవాలేదు, ఏదో ఒకటి తేలాల్సి ఉంది. లేకుండా వాయిదాల మీద వాయిదాలతో వెళుతుంటే ఆ భూమి నిరుపయోగమే, దానికి భూములు ఇచ్చిన వాళ్లు, ఆ ప్రాజెక్టుకు పెట్టిన వేల కోట్ల ఖర్చు నిరుపయోగమే. అక్కడ ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మించాలని అనుకున్నప్పటికీ ఏది నిర్మించలేకపోయింది.

వ్యాన్ పిక్ కేసు మాత్రం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. వేలాది కోట్ల మేర అక్రమాలు జరిగాయని, తాము పెట్టిన పెట్టిన పెట్టుబడులు వెనక్కి ఇప్పించాలని నిమ్మగడ్డ ప్రసాద్ తో ఒప్పందం చేసుకున్న ఆల్ ఖైమా అనే సంస్థ ఇప్పటికే కోర్టుకు ఎక్కింది. ఆ కంపెనీ కూడా ఊరుకోవడం లేదు. సో.. మొత్తం మీద విదేశీ కంపెనీల ప్రమేయం ఉంది కాబట్టి మనీ లాండరింగ్, క్విడ్ ప్రొకో అనే కేసుల కిందకు కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్లు ఎలాగొలా సీబీఐ లాయర్ ల ద్వారా కేసును ఏదో ఒకటి చేసి వాయిదా వేయాలని చూసినా అటు వైపు నుండి ఈ పిటిషన్ వేసిన విదేశీ కంపెనీలు, విదేశీ వ్యాపార సంస్థలు అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి సీబీఐ మీద ఆ రకమైన ఒత్తిడి ఉంది. అందుకే కశ్చితంగా ఈ నెల 23 సోమవారం జరిగే విచారణకు జగన్మోహనరెడ్డి టీమ్ హజరుకావాల్సి ఉంది. అయితే జగన్మోహనరెడ్డి తరపు లాయర్లు మాత్రం విచారణకు ఆయన హజరుకాకుండా ఉండేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటొచ్చీ సోమవారం అయితే హజరు అవ్వరు. నేరుగా జగన్మోహనరెడ్డి తరపు లాయర్ లు కోర్టుకు వెళ్లి ఎందుకు రాలేదో ఏమిటో కారణం చెప్పి వాయిదా కోరతారు. ఏదో ఒకటో రెండు వాయిదాలు అయితే ఇస్తారు కానీ మళ్లీ మళ్లీ అయితే వాయిదాలు ఇచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. ఈ సీబీఐ కేసులో అదనపు చార్జి షీట్ల కారణంగా జగన్మోహనరెడ్డి మీద ప్రెజర్ అయితే ఎక్కువ అయిన మాట వాస్తవం.

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju