అందరికీ గుర్తుండే ఉంటుంది… జగన్ సీఎం కాక ముందు ఆ 23 మంది ఎమ్మెల్యేలు.. ఆ 23 మంది ఎమ్మెల్యేలు అనేవారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలు నాటి ప్రతిపక్ష వైసీపీని వీడి, అధికార టీడీపీలోకి జంపయ్యారు. అందుకే జగన్ కి బాగా కాలి రెండేళ్లకు పైగా వారిని బాగా గుర్తు పెట్టుకున్నారు. వారి పదవులు పోవాలని, మళ్ళీ ఎన్నికలకు రావాలని జగన్ అనేక సార్లు సవాలు చేసారు…!
ఇప్పుడు సేమ్ ఓ ముగ్గురు ఎమ్మెల్సీల విషయంలో చంద్రబాబుకి అదే పరిస్థితి ఎదురయింది. మరి జగన్ కంటే బాబు సీనియర్, ముదురు, కాస్త రాజకీయ తెలివి ఎక్కువ, పైగా మండలిలో చైర్మన్ గా తన మనిషి ఉన్నారు. అందుకే ముగ్గురు ఎమ్మెల్సీల విషయంలో బాబు పట్టు వీడడం లేదు.
ఈ ముగ్గురు చిక్కరు… దొరకరు…!
నిజానికి న్యాయ సూత్రాలు ప్రకారం చుస్తే ముగ్గురు ఎమ్మెల్సీ దొరికిపోయినట్టే. నాడు రాజధాని వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా విప్ జారీ చేసింది. ఎమ్మెల్సీలు ముగ్గురు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి, శమంతకమనిలు కచ్చితంగా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేయాల్సిందే.., లేకపోతే వేటు తప్పదు అంటూ విప్ ఇచ్చేసింది. కానీ ఈ ముగ్గురు ధిక్కరించారు. అందుకే టీడీపీ పిర్యాదు చేసింది. విచారకు చైర్మన్ స్వీకరించారు. కానీ ఈ ముగ్గురు విచారణకు రావడం లేదు. నోటీసులు అందుకుని, గమ్మునుంటున్నారు. పార్టీ మారారు.., కానీ పదవులు ఉండాలంటున్నారు..! విచారణకు సిద్ధమే అంటున్నారు… కానీ మండలి చైర్మన్ పిలిస్తే రావడం లేదు. మూడు సార్లు విచారణకు హాజరు కాలేదు. ఇంకా ఇంకా సాకులు చెప్తూ సమయం అడుగుతున్నారు. తాజాగా ఈ నెల 2 న కూడా విచారణకు వెళ్లకపోవంతో… చైర్మన్ కి మాత్రం ఎంతకాలం సహనం ఉంటుంది. బాగా కాలింది.., ఇక చివరిగా మళ్ళీ నోటీసులిచ్చారు.
పాపం పోతుల సునీత…!
ఈ ముగ్గురు ఎమ్మెల్సీ నిజానికి అనుకున్నది ఒకటి అయినది ఒకటిగా మారింది. వీరితో పాటూ మరో పదిమంది వస్తారు. అందరూ కలిసి బిల్లు తిరస్కరిస్తే… కీలక బిల్లుకి మద్దతు ఇచ్చినందుకు జగన్ దగ్గర మంచి ప్రాధాన్యత దక్కుతుంది అనుకున్నారు. కానీ ఇది బెడిసికొట్టింది. ఈ ముగ్గురి రాకను కూడా జగన్ ఏమాత్రం అంగీకరించలేదు. కానీ స్థానిక పరిస్థితులు, అధికార దాహంతో పార్టీ మారిపోయారు. వీరిలో సమంతకమానికి మరో ఏడాది మాత్రమే వ్యవధి ఉంది. శివనాథ్ రెడ్డికి మూడేళ్లు, పోతుల సునీతకి రెండున్నరేళ్లు వ్యవధి ఉంది. పోతుల సునీత పార్టీ మారిన తర్వాత ఎటూ కాకుండా అయిపోయారు. కేవలం కార్యక్రమాల్లో ఫోటోల కోసం ఒంగోలు కలెక్టరేట్ కి వెళ్లి వస్తుంటారు. ఎమ్మెల్సీ అనే హోదా ఉన్నప్పటికీ అధికార పార్టీలో సాధారణ కార్యకర్తకు ఉన్న గుర్తింపు కూడా లేక అవస్థలు పడుతున్నారు. ఈమె స్థాయికి మించి చంద్రబాబు నాడు ఎమ్మెల్సి పదవి ఇచ్చినా.. ఆశపడి, ప్రలోభానికి లొంగి వైసిపిలోకి వెళ్లారని అపవాదు మూటగట్టుకున్నారు. ఇటు టీడీపీ కి దూరమై, అటు వైసిపిలో ప్రాధాన్యత లేక రాజకీయంగా ఇక తన భవిష్యత్తుని తాకట్టు పెట్టేశారని విమర్శలు ఉన్నాయి.