అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టిడిపి పరిస్థితిపై ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రముఖ హాస్య నటుడు బ్రహానందంతో పోలుస్తూ వ్యంగంగా చలోక్తి విసిరారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడిన ప్రతిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవ్వుల్లో మునిగిపోతున్నారనీ రాంగోపాల్ వర్మ తెలిపారు.
సినిమా తెరపై బ్రహ్మానందం వచ్చినప్పుడు మాత్రమే జనాలు ఇలా నవ్వడాన్ని తాను చూశాననీ వర్మ వ్యాఖ్యానించారు. టిడిపి ఇప్పుడు ఏపి అసెంబ్లీలో కామెడీ ట్రాక్గా మారిపోయిందని వర్మ ఎద్దేవా చేశారు.
. @ysjagan bursts into laughter every time @ncbn speaks in assembly ..The last time I saw such reaction is when people see Brahmanandam on screen ..So is TDP a comedy track in AP Assembly ..Just Asking!
— Ram Gopal Varma (@RGVzoomin) July 11, 2019
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?