అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు విషయంలో జగన్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీలం సాహ్ని పదవీ కాలాన్ని కేంద్రం మరో 3 నెలలు పొడిగించింది. కొద్ది రోజుల క్రితం ఈ అంశంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం చేసుకున్న విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన లభించింది. చీఫ్ సెక్రటరీ పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. జూన్ నెలాఖరుతో సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం ముగుస్తుంది. అయితే, మరో ఆరు నెలల పాటు ఆమె పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపుపై న్యూస్ ఆర్బిట్ ముందుగానే కధనం ఇచ్చింది. ‘నీలం సాహ్నికి జగన్’ వరం పేరుతో మే 13 న నీలం సాహ్నికి జగన్ వరం…! కధనం ప్రచురించడం జరిగింది.