Covid: ప్రస్తుతం దేశాన్ని కోవిడ్ సెకండ్ వేవ్ అల్లాడిస్తున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పాజిటివ్ కేసులు కొన్ని లక్షల లో బయటపడుతూ ఉండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా నిబంధనలను రాష్ట్రాలలో కఠినంగా అమలు చేయాలని కోరడం జరిగింది. ముఖ్యంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం విషయంలో ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కోరడం జరిగింది.
అయినా కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండటం తో పాటు మరో పక్క వ్యాక్సిన్ కొరత దేశంలో ఏర్పడటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మేటర్ లోకి వెళ్తే వివిధ దేశాలకు చెందిన వ్యాక్సిన్లను దేశంలో ప్రవేశపెట్టడానికి టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం ఇండియా లో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరి కొన్ని విదేశాలకు చెందిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ నిపుణుల బృందం రెడీ అవుతున్నాయి. ఏది ఏమైనా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అతి తక్కువ టైమ్ లోనే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొత్తం పూర్తి చేయటానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. ప్రస్తుత పరిస్థితిని అధిగమించాలంటే ఒకపక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న మరో పక్క రాష్ట్రాలలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.