అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చంద్రబాబు వెళుతుండగా..ఆయన పర్యటనకు తొలుత కేంద్రం పలు ఆంక్షలు విధించింది. పర్యటనను నాలుగు రోజులకు కుదించుకోవాలని, ఐదుగురే వెళ్లాలని సూచించిన విషయం విదితమే. ఈ ఆంక్షలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మారు కేంద్రానికి ధరఖాస్తు చేయాలని సీఎంఓను ఆదేశించారు. దీనిపై మనసు మార్చుకున్న కేంద్రం తన బృందంతో దావోస్ పర్యటనకు అనుమతి ఇస్తూ పర్యటన నాలుగు రోజులకు కుదించింది.
previous post
next post