అమరావతి, జనవరి 29: బంద్లో పాల్గొన్నకుండా కొన్ని పార్టీలను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కట్టడి చేయడం దుర్మార్గమని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అచార్య నాగార్జునా యూనివర్శిటీలో ప్రత్యేక హోదా సాధన సమితి సమావేశం నిర్వహించారు. రాష్ట్రం కోసం ఫిబ్రవరి ఒకటవ తేదీన నిర్వహించనున్న బంద్కు అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలని ఆయన కోరారు.
రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్న జాతీయ రహదారులను దిగ్బంధనం చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
బంద్కు తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలిపింది.