అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ పక్కచూపులు చూస్తున్నాడని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుమానిస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ కారణం చేతే ఆయనకు ఇటీవల టిడిపి జరిపిన పదవుల పందేరంలో ఏ ఒక్కదానిని చంద్రబాబు ఇవ్వలేదంటున్నారు.నిజానికి చంద్రబాబు అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారనే చెప్పాలి.2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ తదుపరి చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీని చేశారు.
వైసిపి కూడా పయ్యావుల కేశవ్ ను టార్గెట్ చేసి అనేక ఆరోపణలు చేసింది. రాజధాని అమరావతిలో ఆయన ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డాడని ఆరోపించింది. కేశవు కూడా టీడీపీకి అత్యంత విధేయంగా పనిచేశారు ఆ పార్టీకి అనుకూలంగా వాయిస్ వినిపించే వారు. ఇక మొన్నటి ఎన్నికల్లో అయితే పయ్యావుల కేశవ్ జగన్ సునామీని అధిగమించి ఉరవకొండ నుండి విజయం సాధించారు.తదుపరి శాసనసభలో ఆనవాయితీగా ఉన్న ప్రతిపక్షానికి ఇచ్చే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిని చంద్రబాబు పట్టుబట్టి పయ్యావుల కేశవ్ కే ఇప్పించారు.ఆ తదుపరి కేశవ వైఖరిలో మార్పు వచ్చిందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. పైగా ఆయన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఉండి కూడా ఇసుక అక్రమాలు, గనుల అక్రమాలు, నాడు-నేడులో జరుగుతున్న దుర్వినియోగం.. వివిధ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించకపోవడం.. ప్రభుత్వంపై నివేదిక ఇవ్వకపోవడాని వారు వేలెత్తి చూపుతున్నారు.
ప్రభుత్వం పై పోరాడటానికి ఇలాంటి ఆయుధం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం.తన పార్టీ వాడే ఈ పదవిలో ఉన్నందున ఏదో ఒక విధంగా తమకు కొన్ని విమర్శనాస్త్రాలు అందిస్తారని చంద్రబాబు భావించారట.కానీ పయ్యావుల కేశవ్ ఆ ఊసే ఎత్తక పోగా తనకు లభించిన క్యాబినెట్ హోదా పదవిని ఎంజాయ్ చేస్తున్నారని టిడిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతేగాకుండా ఇటీవలి కాలంలో పయ్యావుల కేశవ్ టిడిపి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట .ఇవన్నీ చంద్రబాబు దృష్టిలో పడడంతో ఆయన తన సామాజిక వర్గీయుడే అయినప్పటికీ పయ్యావుల కేశవ్ కు చెక్ పెట్టే కార్యక్రమం చేపట్టారట.పయ్యావుల కేశవ్ పార్టీలో కొనసాగడంపైనా అనుమానం పెంచుకున్న చంద్రబాబు ఇక ఆయనకు ఏ పదవి ఇచ్చే ఆలోచనను విరమించుకున్నారని టిడిపి వర్గాల సమాచారం.మొత్తం మీద చూస్తే పయ్యావుల కేశవ్ పార్టీ అధినేత చంద్రబాబు అనుగ్రహాన్ని కోల్పోయినట్లే స్పష్టమవుతోంది.