ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తన కలల రాజధాని అమరావతి కోసం నేరుగా రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పెట్టాలని అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులతో గాని ఇటు రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులతో గాని చేస్తున్న ప్రయత్నాలు చేయకపోవడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. దీంతో చంద్రబాబు విశాఖ నడి బొడ్డులో రాజధాని అమరావతి కోసం దీక్ష చేయాలని… విశాఖ వాసులకు జై అమరావతి అనిపించాలని సరికొత్త స్ట్రాటజీ చంద్రబాబు వేసినట్లు టాక్. మరోపక్క రాజధాని అమరావతిని పెద్దగా ఏపీ ప్రజలు పట్టించుకున్న దాఖలాలు మొదటి నుంచి కనబడలేదు.
అందుకోసమే టిడిపి భవిష్యత్ నాయకుడు కూడా రాజధాని ప్రాంతం పరిధిలో పోటీ చేసి ఓడిపోయిన సందర్భం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు విశాఖపట్నంలో “జై అమరావతి” అనిపించాలని తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమయిన నిర్ణయమని విశ్లేషిస్తున్నారు. మరి విశాఖ వాసులు చంద్రబాబు కలల రాజధాని కి జై కొడతారు లేదో అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి . మరోపక్క అప్పట్లో చంద్రబాబు విశాఖ లో అడుగు పెట్టిన టైమ్ లో “గో బ్యాక్” బాబు అంటూ నినదించారు.
అయితే అదంతా వైసీపీ కుట్ర అని చంద్రబాబు అప్పట్లో కొట్టేశారు. పరిస్థితి ఇలా ఉండగా కరోనా కష్టకాలంలో చాలావరకూ వైజాగ్ లో జరిగిన అనేక ప్రమాదాలకు బాధితులకు అండగా నిలవాలేని చంద్రబాబు, ఇప్పుడు తన కలల రాజధాని అమరావతి ని సపోర్ట్ చేయాలని వైజాగ్ నడిబొడ్డులో తలపెట్టే కార్యక్రమానికి ఏ మేరకు వైజాగ్ వాసులు మద్దతు తెలుపుతారు అన్నది సస్పెన్స్ గా ఉంది.
ఇప్పటికే అమరావతి విషయంలో గవర్నర్ మరియు కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. అంతే కాకుండా మూడు రాజధానుల బిల్లులకు చట్టపరమైన భద్రత కూడా వచ్చేసింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు విశాఖ నడిబొడ్డులో అమరావతి నినాదాన్ని ఎత్తుకోవటం అనేది మామూలు విషయం కాదని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.