అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు రైతుల ఉద్యమం విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష షాకింగ్ కామెంట్ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఇటీవల కడప లో మీడియా సమావేశంలో రాజధాని విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో అమరావతి రైతులు అంటూ చేస్తున్న ఉద్యమం…. డూప్లికేట్ ఉద్యమమని, రాజధాని ప్రాంతంలో అసలు ఉద్యమమే లేదని స్పష్టం చేశారు.
ఉద్యమం అంటూ అక్కడ హడావిడి చేస్తున్న వాళ్లంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని చంద్రబాబు కోసం పని చేస్తున్న ఆయన బినామీ లేనని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. అమరావతిలో చంద్రబాబు దర్శకత్వంలో డ్రామా ఉద్యమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి ఉన్న కొద్ది మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
త్వరలో అక్కడ ఉద్యమం చేస్తున్నా వాళ్ళ లిస్ట్ అనగా చంద్రబాబు బినామీలు లిస్ట్ బయటికి వస్తుంది అన్నట్టుగా ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నట్లు సమాచారం. ఇదే గ్రామంలో రాజధాని ప్రాంతంలో ఉండే స్థానికులు కూడా ఇక్కడ ఉద్యమాలు చేసే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని అంటున్నారట. కిరాయికి బయట మనుషులను తెచ్చుకునే టీడీపీ నాయకులు రాజధాని ప్రాంతంలో దొంగ ఉద్యమాలు చేస్తున్నట్లు ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు ఆరోపిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావొస్తుంది 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయిందని అంజాద్ బాషా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇళ్ల పట్టాల పంపిణీ ఎలాగైనా అడ్డుకోవాలని రకరకాలుగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పరిపాలనలో ఒక్క నిరుపేదకి కూడా ఇల్లు కట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆధారాలు లేకుండా ప్రధానికి చంద్రబాబు లెటర్ రాయడం సిగ్గుచేటని విమర్శించారు.