ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ లోకి వెళ్లిపోతున్నట్లు ‘మహానాడు’ జరుగుతున్న టైం లో వార్తలు తెలుగు మీడియా వర్గాల్లో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ‘మహానాడు’ జరిగే టైం లో చంద్రబాబు కి షాక్ ఇచ్చే విధంగా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం కోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు అంతా రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. తీరా చూస్తే మహానాడు అయ్యి వారం రోజులు గడిచినా టీడీపీ పార్టీ నుండి ఏ ఎమ్మెల్యే ఎవరు ఇప్పటికీ వైసీపీలోకి వెళ్లలేదు.
మరోపక్క త్వరలో చంద్రబాబుకి మిగిలివున్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయటానికి వైసీపీ ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో వలసల విషయంలో చంద్రబాబు జాగ్రత్త పడినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు అధికార పార్టీకి దిమ్మతిరిగిపోయే విధంగా సరికొత్త ఆలోచన చేపట్టినట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు వస్తున్నాయి.
ఈ విషయం నడుస్తూ ఉండగానే వైసిపి ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంలో ఆ పార్టీలో ఉన్న నాయకులే ప్రభుత్వంపై మీడియా ముందు బహిరంగంగా విమర్శలు చేసే విధంగా వ్యవహరిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలో ఎవరైతే జంప్ అవ్వాలనుకుంటున్నారో సదరు ఎమ్మెల్యేలు డ్రాప్ అయ్యారట. మరోపక్క ఇదే టైం లో పార్టీ లో చంద్రబాబు డిసిప్లేనరీ కమిటీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ పార్టీలో టాక్. ఈ దెబ్బతో చంద్రబాబు వలసల ఎమ్మెల్యేలకు చెక్ పెట్టబోతున్నట్లు, మిగిలివున్న ప్రతిపక్ష హోదా కోల్పోకుండా చాణిక్య రాజకీయ ఎత్తుగడలు వేసినట్లు సమాచారం.