Chandrababu Naidu : చంద్రబాబు నాయుడు Chandrababu Naidu.. అధికారంలో ఉన్నప్పుడు తన మాటే శాసనం అనుకుంటూ దూసుకెళ్లిపోయారు చంద్రబాబు. తాను తీసుకున్నదే నిర్ణయం.. చెప్పిందే వేదం.. అనే రీతిలోనే పరిపాలన చేశారు. సీఎంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలపై ప్రజలు, మీడియా, వ్యవస్థల నుంచి వ్యతిరేకత వస్తే మాత్రం తట్టుకోలేకపోయేవారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది కేంద్రం. ఇందుకు అప్పట్లో సీఎం హాదాలో చంద్రబాబు ఓకే చెప్పేశారు. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలనే తుంగలో తొక్కేసింది ఎన్డీఏ. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీకి ఏం చేస్తుందో..? అని రాష్ట్రవ్యాప్త ఆందోళనలు మిన్నంటాయి.
ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదాపై ఉద్యమించారు. జనసేన, వామపక్షాలు కూడా పోరాడాయి. విద్యార్ధి సంఘాలు పోరాడాయి. అయితే.. వీరందరి ఉద్యమాన్ని చంద్రబాబు ఆనాడు విమర్శించారు. కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇస్తానంటే మీకేంటి? అనేశారు. పైగా.. విద్యార్ధుల తల్లిదండ్రులను ఉద్దేశించి.. పిల్లల్ని గడప దాటనీయకండి అని ఉద్భోధ చేశారు. ‘హోదా అంటే జైలుకే..’ అన్నారు కూడా. మీడియాలో కూడా పతాక శీర్షికల్లో బ్యానర్ ఐటమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని అంటే.. కాదు విశాఖపట్నం అని సీఎం వైఎస్ జగన్ అంటున్నారు. అమరావతి ఉద్యమం జరుగుతోంది. అయితే
ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న విజయవాడలో ప్రచారం చేశారు చంద్రబాబు. అమరావతి కోసం ఇంటికొకరు చొప్పున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇదే చంద్రబాబు నాడు విద్యార్దులు బయటకొస్తే జైలుకు పంపిస్తా అన్నారు. నాడు ప్రజా పోరాటాన్ని అణగదొక్కేసిన చంద్రబాబు.. నేడు అదే యువతను ‘పౌరుషం లేదా..?’ అని ప్రశ్నించడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉంటే ఒకలా.. లేకుంటే ఒకలా వ్యవహరించాలన్నట్టు చంద్రబాబు తీరు ఉందనే విమర్శలూ వస్తున్నాయి. అమరావతి ఎలానో.. ప్రత్యేకహోదా అంశమూ అలానే అనే విషయం మర్చిపోయారా..? చంద్రబాబూ.. అని కామెంట్లు వేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?