Mahanadu 2022: నటసింహం నందమూరి బాలయ్య బాబు వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో గత ఏడాది అఖండ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన ఈ మూడో సినిమా.. రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. విదేశాలలో సైతం బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అటువంటి “అఖండ” సినిమా పేరు చెప్పి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు… ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒంగోలు జిల్లాలో మహానాడు కార్యక్రమం జరుగుతున్నది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. సినిమా పరిశ్రమ పై జగన్ పెత్తనం ఏంటి అని నిలదీశారు. ఇంకా అనేక వ్యాఖ్యలు చేస్తూ బాలకృష్ణ సినిమా “అఖండ” కి ఏపీలో అనేక ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. “అఖండ” స్పెషల్ షో లకు జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని.. అయినా కానీ బాలకృష్ణ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రజల పై నమ్మకంతో సినిమా విడుదల చేసి అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు.
సీఎం జగన్ చేతకాని దద్దమ్మ సినిమా ఇండస్ట్రీనీ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో నేను ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పేపర్ టీవీ.. భారతి సిమెంట్ లకి తానే పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. దీంతో “మహానాడు”లో బాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోనూ రాజకీయవర్గాలలో సంచలనం రేపుతున్నయి. అంతమాత్రమే కాదు ఇదే సమయంలో పోలీసులను ఉద్దేశించి కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చే రీతిలో ప్రసంగించారు.