అమరావతి. జనవరి 12: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసును ఎన్ఐఎకు అప్పగించడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. ఎన్ఐఎకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి అని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు పేజీల లేఖ రాసారు. ప్రధానికి పంపిన లేఖను శనివారం మీడియాకు విడుదల చేశారు.
దేశ భద్రత, రక్షణ, ఉగ్రవాద చర్యలకు సంబంధించిన కేసులను మాత్రమే ఎన్ఐఎ దర్యాప్తునకు అప్పగించాలనే నిబంధనలు ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకుని, రాష్ట్రాలను భయపెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. సంబంధం లేని విషయాల్లో ఎన్ఐఎ జోక్యం చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.