తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై ఆస్తుల విధ్వంసం చేస్తారా అంటూ సీరియస్ అయ్యారు. ఇటీవల విశాఖపట్నంలో సబ్బంహరి ఇంటి ప్రహరీ కూల్చివేత, అదేవిధంగా పట్టాభి కారు ధ్వంసం వంటి విషయాలను లేవనెత్తి కక్షసాధింపు చర్యలు ఏపీ ప్రభుత్వం చేపడుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ని వేధించడం ని పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 18 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి కడప హరి ప్రసాద్ నీ అరెస్టు చేయటం దారుణమని, అదేవిధంగా మాజీ మంత్రి జవహర్ పై తప్పుడు కేసులు పెట్టడం కక్షసాధింపు అని విమర్శించారు. ఇదేవిధంగా జ్యోతుల నవీన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దుర్మార్గం అని చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మళ్ళీ కరోనా కేసులు పెట్టడం దుర్మార్గమని… మొత్తం పరిణామాలు చూస్తే కక్షసాధింపు కిందే ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఇన్ని సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని స్పష్టం చేశారు. మనం చేస్తుంది దుర్మార్గులతో పోరాటం కాబట్టి టిడిపి సేన మొత్తం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. అదేవిధంగా పోలీసు శాఖ పై న్యాయ స్థానాలు ఇప్పటికే మొట్టికాయలు వేసేయి. అయినా సరే పోలీసుల పనితీరులో మార్పు లేదని అన్నారు. ఇటువంటి పరిస్థితులు సమాజానికి మంచిది కాదని ఇకనైనా మార్పు రావాలని, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా పార్టీలకతీతంగా కఠినంగా శిక్షలు అనుభవించేలా వ్యవస్థలు ఉండాలని చంద్రబాబు తెలిపారు.