తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ గెలవడం రాష్ట్రానికే కాదు దేశానికి పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఫలితాలు వచ్చాయి. అటువంటిది మొట్టమొదటిసారి దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీని పక్కకునెట్టి కమలం వికసించాడంతో… కేసిఆర్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయిందని వార్తలు వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం సమయంలో ప్రతిపక్షాలు కేవలం గోల చేస్తాయని, రిజల్ట్ టిఆర్ఎస్ పార్టీకి ఫేవర్ గా ఉంటుందని చెప్పిన కేసీఆర్ కి దుబ్బాక ఓటర్లు ఇచ్చిన తీర్పుతో టిఆర్ఎస్ పార్టీ కి డేంజర్ బెల్స్ తెలంగాణలో స్టార్ట్ అయినట్లే అని పరిశీలకుల మాట.
ఇదిలా ఉండగా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం కెసిఆర్ కి ఏమోగానీ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కి మరింత టెన్షన్ పెన్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ గెలుపు ఏపీలో టీడీపీ పతనానికి పునాదులు పడినట్లే అనే టాక్ గట్టిగా వస్తోంది. తెలంగాణలో ఊహించని విధంగా అనేక పోరాటాలు చేస్తూ బిజెపి తెలంగాణ ప్రజల లోకి చొచ్చుకు పోయింది. ఈ క్రమంలో ఇదే తరహాలో ఏపీలో కూడా వ్యవహరిస్తుంది. గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో ఏపీలో ప్రతిపక్ష పాత్ర బిజెపి పోషిస్తూ వస్తోంది.
అంతేకాకుండా బీజేపీ పార్టీలో ఉండే టీడీపీ కోవర్టులని గుర్తిస్తూ బయటకు పంపేస్తుంది. మరోపక్క జగన్ సర్కార్ టీడీపీలో ఉండే కీలక నాయకులను టార్గెట్ చేస్తూ ఉండటంతో చాలామంది టిడిపిని వీడి బయటకు వెళ్లి పోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎటొచ్చిన టిడిపి పార్టీ గతంలో మాదిరిగా యాక్టివ్ గా లేని పరిస్థితి ఉండటంతో… మరోపక్క టీడీపీకి ప్రత్యామ్నాయంగా బిజెపి నాయకులు కీలక గా రాణించడంతో పాటు పక్క తెలుగు రాష్ట్రం దుబ్బాక లో బీజేపీ గెలుపుతో ఏపీలో బీజేపీ నేతలు మరింత దూకుడుగా వ్యవహరించే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండటంతో టెన్షన్ లో చంద్రబాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బి.జె.పి.తో జత కట్టాలని చూస్తుండగానే చంద్రబాబుకి బిజెపి అగ్రనేతలు డోర్లు తెరవకుండా ఉండటంతో, పైగా వయసు మీద పడటంతో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అనే దాని విషయంలో చంద్రబాబు తెగ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.