గుంటూరు, జనవరి 18: సత్తెనపల్లికి వన్నె తెచ్చే విధంగా తారకరామ సాగర్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం సత్తెనపల్లిలో ఎన్టిఆర్ పార్క్, వావిలాల ఘాట్ను ఆయన ప్రారంభించారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తదితరులతో కలిసి ఎన్టిఆర్ సాగర్లో కొద్దిసేపు బోటు షికారు చేశారు. 36 అడుగుల ఎన్టిఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.
హైదరాబాదు హుస్సేన్ సాగర్లో ఎన్టిఆర్ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టిఆర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని చంద్రబాబు అన్నారు.