Chandrababu : తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా చంద్రబాబు కు అత్యంత క్లోజ్ గా రాణించారు మాజీ ఎంపీ మురళీమోహన్. అంతకుముందే సినిమారంగంలో తనకంటూ సెపరేట్ క్రియేట్ చేసుకుని బిజీ నటుడిగా రాణించడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పే చేసినట్లు వెల్లడించారు. ఇక నుండి తనకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల ఓ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వ్యాపారాలు తమ్ముడు చూసుకుంటున్నాడు : మురళీమోహన్
ఇదే తరుణంలో ఇకనుండి ఇంకా సృష్టి మొత్తం సినిమాలపైనే పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా తన వ్యాపారాలను తమ్ముడు మరియు పిల్లలకు అప్పగించినట్టు చెప్పుకొచ్చారు. వెన్నెముక శస్త్రచికిత్స గతంలో జరగగా దాని నుండి పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదే తరుణంలో సొంత నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్ లో 25 సినిమాలను నిర్మించడం జరిగిందని తెలిపారు.
తన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చివరి చిత్రం “అతడు” అని ఆ తర్వాత రాజకీయాల్లో మరియు వ్యాపారాలు బిజీ అవటంవల్ల సినిమాలు నిర్మించలేక పోయాను అంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చారు. ఇక రాబోయే రోజుల్లో సినిమాలు నిర్మించడంతో పాటు సినిమాలు చేసే ఛాన్స్ ఉందని తెలిపారు. తనకే సినిమారంగానికి దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ వచ్చిందని మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ఈ క్రమంలో ఆర్కే మీడియా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో ప్రస్తుతం నటిస్తున్నట్లు స్పష్టం చేశారు.