2019 ఎన్నికలలో టిడిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ పరిణామంతో ఫలితాలు వచ్చిన తరువాత టీడీపీలో ఉండే కీలక నేతలు వేరే పార్టీ లోకి వెళ్లి పోవడం జరిగింది. మరోపక్క జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ, సంక్షేమ పథకాలు కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా అమలు చేస్తూ చిత్తశుద్ధిగా పని చేస్తున్న తరుణంలో పార్టీలో మిగిలి ఉన్న కీలక నేతలు కూడా జంప్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా విజయవాడలో కీలక రాజకీయ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పేరొందిన వంగవీటి ఫ్యామిలీ వారసత్వం అందిపుచ్చుకున్న వంగవీటి రాధా కూడా పార్టీ మారాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2019 సరిగ్గా ఎన్నికల సమయంలో టిడిపి పార్టీలో వంగవీటి రాధా జాయిన్ అవ్వడం జరిగింది. అంతకుముందు వైసీపీలో కీలక నేతగా రాణించిన వంగవీటి రాధా ఎన్నికల టైంలో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి టికెట్ అడగటంతో వైసిపి హైకమాండ్ ఇవ్వకపోవడంతో… నిరుత్సాహానికి గురి అయ్యి టీడీపీ లోకి వెళ్ళిపోయారు. కానీ రాధా టీడీపీలోకి వెళ్లడం చాలా మంది ఆయన అనుచరులకు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి కుటుంబాన్ని ప్రేమించే వాళ్లు వ్యతిరేకించటం జరిగింది.
ఇదిలా ఉండగా అమరావతి ఉద్యమంలో టీడీపీకి మద్దతు తెలుపుతూ మొన్నటి వరకు ఉన్న రాధ, ఇటీవల టిడిపి పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనటం లేదట. దీంతో వంగవీటి రాధా పార్టీ మారే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు అదేవిధంగా కృష్ణా జిల్లా టిడిపి పార్టీ కీలక నేతలు రాధా నీ బుజ్జగించే ప్రయత్నాలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల రాధా పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు మరియు కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి చాలావరకు దూరమైనట్లు గ్రౌండ్ రిపోర్ట్ లు రావడంతో చంద్రబాబు రాధా విషయంలో తెగ టెన్షన్ పడుతున్నారట. కారణం చూస్తే కాపు సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన కుటుంబం. దీంతో ఆయన్ని ఎలాగైనా టిడిపిలోనే కంటిన్యూ చేసే విధంగా చంద్రబాబు అనేక ఆఫర్లు ఇస్తూ బుజ్జగించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా రాజకీయాల్లో టాక్. మరి వంగవీటి రాధా టిడిపి లో కంటిన్యూ అవుతారో లేదో చూడాలి.