టిడిపి పార్టీ పరిస్థితి రోజు రోజుకు చాలా దయనీయంగా మారిపోతుంది. 2014 ఎన్నికలలో ఘన విజయం సాధించిన 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంతో పాటు కొద్దిపాటి బలంతో ప్రతిపక్షనికి చంద్రబాబు ఫిక్స్ అయిపోయారు. దీంతో పార్టీని ముందుకు నడిపించడానికి తల ప్రాణం తోకకు వస్తూనట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాదు అన్నట్టుగా టీడీపీ నాయకులూ వేరే పార్టీ లోకి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు వయసు మీదపడటంతో టిడిపి పార్టీలో ఉన్న నాయకులు ఇక్కడ ఇదే పార్టీలో ఉంటే మన పరిస్థితి… ఆటలో అరటిపండులా అయిపోతుందని భావిస్తున్నారట.
రాష్ట్రంలో కీలక నియోజకవర్గాలు గా ఉండే టిడిపి బలమున్న నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు తాజాగా చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ తర్వాత జరిగిన 2014 ఎన్నికలలో గాని ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీకి ఎదురు లేదు అన్నట్టుగా అప్పట్లో పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో వైసీపీ హవా నడుస్తోంది అని స్వయంగా టిడిపి నాయకులే అధినేత చంద్రబాబు తో అంటున్నారట.
ఇటీవల పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు రహస్యంగా భేటీ అయినట్లు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటి అని అంతా ఆరా తీసినట్లు టాక్. ఈ సందర్భంగా “కష్టం సార్ ఇంకా కుదరదు మీరు ఏమనుకున్నా సరే చేసేదేమీ లేదు” అని చంద్రబాబు ముందే సీనియర్ నాయకులూ తేల్చి చెప్పినట్లు టిడిపి పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షంగా కూడా సరైన రీతిలో ప్రభుత్వం పై పోరాడిన సందర్భాలు లేకపోవడంతో రాబోయే రోజుల్లో….. ఈ రీతిగా అయితే పార్టీని ముందుకు నడిపించడం కష్టమని చంద్రబాబుకి పార్టీ సీనియర్ నేతలు కుండ బద్దలు కొట్టి చెప్పినట్లు సమాచారం.