టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఆయన పరువు తీసే విధంగా మారినట్లు ఎపి పాలిటిక్స్ లో టాక్ వినపడుతోంది. ఏపీలో న్యాయవాదుల “ఫోన్ ట్యాపింగ్” ఆరోపణల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు రాసిన లెటర్ లో మొదటిలో మోడీ జపం చేస్తూ మేటర్ మొదలెట్టి చివరాఖరిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మెయిన్ హైలెట్ చేస్తూ చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది.
ఏపీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులకు అడ్డు పడుతోందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకుని ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చంద్రబాబు రాసిన లెటర్ తాజాగా రాష్ట్ర బిజెపి నాయకులకి అస్త్రంగా మారింది. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసినా… 2019 ఎన్నికల సంవత్సరం ఉందనగా బిజెపి పార్టీకి కటిఫ్ చెప్పి ఆ ఎన్నికలలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రధాని మోడీకి కుటుంబం లేదని, ఆయన భార్యను వదిలేశాడని వ్యక్తిగతమైన కామెంట్లు చేయడం జరిగింది.
దీంతో తాజాగా చంద్రబాబు రాజీనామా లెటర్ ని టార్గెట్ చేసుకుని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో చంద్రబాబు ని చెడుగుడు ఆడుకున్నరు. 2018 నుండి 2019 ఎన్నికల ప్రచారం ముందు వరకూ చంద్రబాబు ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్టు చేశారు. అవేంటంటే ‘‘నీకు కుటుంబం, బంధాలు లేవు, మా హక్కులు కాలరాశారు. మా అభివృద్దిని చూసి ఓర్వలేకపోతున్నారు. నీ కంటే నేనే ముందు సీఎం అయ్యాను, గుజరాత్ ని ఏం అభివృద్ది చేశావు? మీ రాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి.
మీకు మేము బానిసలం కాదు. మీరు పని చేసే పిఎం కాదు, మాకు పని చేసే ప్రధాని కావాలి’’ ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తడం అవకాశవాదానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రధాని మోడీకి, బీజేపీకి మతిమరుపు లేదని ట్విట్ చేశారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరియు సోషల్ మీడియాలో హైలెట్ అవటంతో బుద్ధి తక్కువ అయ్యి ఆ లెటర్ రాశాను అని చంద్రబాబు టిడిపి పార్టీ సీనియర్ నాయకుల దగ్గర బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు బిజెపి పార్టీ కి లెటర్ రాసి తప్పు చేసినట్లు, అనుకుంటున్నట్లు సమాచారం.