NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu Naidu: ఇప్పుడైనా కార్యకర్తల మాటలు వింటారా..? కుప్పంలో ప్రక్షాళన ఉంటుందా..?

Chandrababu Naidu.. కు పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా కుప్పంలో తగిలిన షాక్ చాలా పెద్దది. ఎంతగా అంటే.. ఎన్నికలు ముగిసి నాలుగు రోజులు అయ్యాయో లేదో.. ఆయన కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి మూడు రోజులపాటు ఆయన కుప్పం నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది నేతలతో సమావేశాలు కాదు. కార్యకర్తలతో. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేకపోతే పార్టీల పునాదులే కదిలిపోతాయి. ఇప్పుడు కుప్పంలో జరిగింది ఇదే. పంచాయతీ ఎన్నికలంటే పార్టీ గుర్తులు లేకపోయినా ప్రజాబలం ఎంతుందో చెప్పే అంచనాలు. ఇక్కడే పట్టు కోల్పోతే పార్టీకి ప్రమాదం. జరగరాని డ్యామేజీ చంద్రబాబుకు అక్కడే జరిగింది. దీంతో అధినేత వెంటనే కదిలారు. తనకు కంచుకోట లాంటి కుప్పంలో టీడీపీ కాదు.. కార్యకర్తలు కుదేలయ్యారనే వార్త ఆయన్ను తీవ్రంగా కలచివేసింది.

Chandrababu Naidu
Chandrababu Naidu

 

Chandrababu Naidu  కార్యకర్తల మాటలు వింటారా?

చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాటలు.. ‘కార్యకర్తలే పార్టీకి బలం. తమ్ముళ్లూ.. మీకు నేను ఉన్నాను. యువత పార్టీలోకి రావాలి. యాక్టివ్ కావాలి. యువతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. యువతతోనే పార్టీ భవిష్యత్తు’ ఇవే. అయితే.. ఇవన్నీ ఆచరణలోకి వస్తాయా అంటే పార్టీలోని నేతలు, కార్యకర్తలు నమ్మలేని పరిస్థితి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు.. 2014లో వచ్చిన వెంటనే మాయం అయ్యాయి. పార్టీలో సీనియర్లకే పట్టం కట్టారు. ప్రభుత్వంలో యువతకు పట్టం కట్టకపోయినా పార్టీ కార్యకలాపాల్లో అయినా ఇస్తారా అంటే అదీ ఉండదు. అక్కడా పార్టీకీ, వయసులో ఉన్న సీనియర్ల మాటే చెల్లుబాటు. కొత్తకొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువత క్షేత్రస్థాయిలో పనులకు ఉండిపోతారు. ఇప్పుడిదే యువత పార్టీని గ్రామాగ్రామన మోయాలని చూసినా ఫలితం లేకపోతోంది. చంద్రబాబు చుట్టూ ఉండే నేతలు కార్యకర్తల సమస్యలు, గ్రామాల్లోని సమస్యలు తీసుకెళ్లనివ్వరు. చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీనే అంతా చూసుకుంటుంది. వీరు చెప్పే మాటలే చంద్రబాబు పాటిస్తారు. దీంతో కార్యకర్తలు చెప్పాలనుకున్నది ‘నాకు తెలుసు’ అని భరోసా ఇస్తారు. మళ్లీ షరా మామూలే.

 

చంద్రబాబు కోటరీ దాటుతారా..?

కుప్పంలో చంద్రబాబుకు పెద్ద కోటరీనే ఉంది. మునిరత్నం, గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్.. ఇలా వీరిదే రాజ్యం. వీరి కనుసన్నల్లోనే పార్టీ నుడుస్తుంది. కార్యకర్తలకు సమస్యలు.. గ్రామాల్లో పార్టీ అభివృద్ధి, నియోజకవర్గంలో అభివృద్ధి అంతా వీరే చూసుకుంటారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు బాగానే నడిచింది. చంద్రబాబు అక్కడకు వచ్చింది కూడా తక్కువే. 2019 ఎన్నికల ప్రచారానికి కూడా రాలేదు. కారణం.. అక్కడ టీడీపీకి బలం ఎక్కువ. కానీ.. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిపోయింది. 89 పంచాయతీలకు 74 వైసీపీ గెలుచుకోవడం ఏకంగా చంద్రబాబుకే ఖంగు తినిపించింది. దీంతో రీసెంట్ గా కుప్పంలో జరిగిన అంతర్గత సమావేశంలో మీదే తప్పు.. కాదు మీదే తప్పు అంటూ నేతలు కార్యకర్తలు అరుచుకుని ఆరోపణలు చేసుకుకునేంత వరకూ వెళ్లింది. కొందరు పార్టీకి రాజీనామా కూడా చేయబోయారు. జరిగిన నష్టం పునరావృతం కాకూడదనే చంద్రబాబు పర్యటన ఏర్పాటు చేశారు. అయితే.. ఈసరైనా చంద్రబాబు కార్యకర్తల ఇబ్బందులు, క్షేత్రస్థాయి సమస్యలు. పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుంటారా అనే ప్రశ్న సగటు కుప్పం టీడీపీ కార్యకర్తల్లో ఉంది.

 

కుప్పం సమస్యలు పరిష్కారమవుతాయా?

అధినేత ప్రసంగం, నాయకుల ప్రసంగాలే కాకుండా కార్యకర్తల సమావేశాలు కూడా ఉంటేనే పార్టీకి లాభం. వైసీపీ గెలిచింది కాబట్టి ప్రజాస్వామ్యం ఓడిపోయింది.. తాము గెలిస్తే మన కష్టం గెలిపించి వంటి డైలాగులు చంద్రబాబు పక్కనపెట్టాలి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ క్షేత్రస్థాయి పరిస్థతులు తెలుసుకోకుండా టెక్నాలజీపైనే ఆధారపడ్డారు. ఆ ర్యాంకులను చూసుకుని తామే అధికారంలోకి వస్తామని భ్రమించి భంగపడ్డారు. కుప్పంలో కూడా జరుగుతోంది అదే. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేశాం.. సంపాదించాం.. ఇప్పుడు ఎన్నికల్లో కాస్త ఖర్చు పెట్టుంటే పరిస్థితి వేరేలా ఉండేదిని కుప్పం నాయకుల్లోనే అనుకుంటున్నారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో తెలుస్తోంది. కష్ట సమయంలో, అధికారంలో లేని సమయంలో కాకపోతే మరెప్పుడు అనే వాదన వారిలో ఉంది. మరి ఈ సమస్యలన్నింటినీ చంద్రబాబు వింటారా.. లేక ఇలా చేయండి.. నేనున్నాను.. అంతా నాకు తెలుసు.. అంటూ సమావేశాలు ఇచ్చి ఊరుకుంటారా చూడాలి. అలా కాకుండా.. తన కోటరీని పక్కనపెట్టి కుప్పం నేతల్లో పెరిగిన గ్యాప్ ను ఈ మూడురోజుల్లో తెలుసుకుని ముందుకెళ్తే

 

author avatar
Muraliak

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?