గత కొద్ది రోజుల నుండి హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడటంతో నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రజలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని పోయిన చాలా మంది తినడానికి ఆహారం లేక ఉంటున్న వారికి ఆహారాన్ని అందిస్తూ ఎవరికి వారు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.
నగరంలో ఎటు చూసినా నీళ్లు ఉండటంతో హుస్సేన్ సాగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన వారు ఉన్నారు. మరికొంతమంది ఇళ్లలోకి వరదనీరు చేరడంతో, నిత్యావసర సరుకులనీ తడిసిపోవడంతో, ఏం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. హైదరాబాదులో కురుస్తున్న వర్షం కారణంగా చాలా మంది నిరాశ్రయులయ్యారు.
దీంతో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పెద్ద మనసుతో స్పందిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నాయి. ఆర్థిక సహాయాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మమతా బెనర్జీ రెండు కోట్ల ను ప్రకటించింది. ఇదిలా ఉండగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ వర్షాలు విషయంలో ఓ ప్రకటన రిలీజ్ చేశారు. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలంతా ఇళ్లల్లోనే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మీరు జాగ్రత్తగా ఉండు మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. అంతే కాకుండా హైదరాబాద్ ప్రజల రక్షణకోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అదేవిధంగా నగరంలో వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టిడిపి నేతలు కార్యకర్తలు ప్రజలకు సాయం అందించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ వర్షాలు విషయంలో రియాక్ట్ అయ్యారు.