అమరావతి: తప్పును ఎత్తిచూపించే వాళ్ళ నోళ్ళు నొక్కేయాలనుకోవడం వైసిపి ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. వాటిని హరించడం అప్రజాస్వామికమని అన్నారు. తమ పనుల పట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకిలా భయపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.
తప్పును ఎత్తిచూపించే వాళ్ళ నోళ్ళు నొక్కేయాలనుకోవడం వైసీపీ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించింది. వాటిని హరించడం అప్రజాస్వామికం. తమ పనులపట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకిలా భయపడుతున్నారు?#JaganFailedCM
— N Chandrababu Naidu (@ncbn) October 17, 2019