ఆంధ్రప్రదేశ్లో ఆరేళ్లలో ఇద్దరు టిడిపి రాష్ట్ర అధ్యక్షులను మార్చిన చంద్రబాబు నాయుడు తెలంగాణ విషయానికొచ్చేసరికి మాత్రం పాత అధ్యక్షుడినే కొనసాగిస్తున్నారు.
బి.సి కాన్సెప్ట్ నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ రమణ వల్ల తెలంగాణలో ఆ పార్టీ పెద్దగా బలోపేతం అయ్యే సూచనలే గోచరించడం లేదని టిడిపి వర్గాలు పెదవి విరుస్తున్నాయి నిజమే ఒకప్పుడు తెలంగాణాలో బీసీలు టీడీపీకి పెట్టని కోట.పదవుల 1999 లో చంద్రబాబు సొంతంగా అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో వచ్చిన సీట్లు ఆయనకు బాగా ప్లస్ అయ్యాయి.అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ మనుగడకే ప్రమాదం వాటిల్లింది.2014 ఎన్నికల్లో పదిహేను అసెంబ్లీ సీట్లు సంపాదించుకున టీడీపీ బలం 2019 నాటికి రెండు కు పడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో అయితే అసలు ఖాతానే తెరవలేదు.
ఇక నూటయాభై సీట్లు ఉన్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపికి ఒకే ఒక్క డివిజన్ లభించింది. విభజన తదుపరి తెలంగాణలో పూర్తిగా వైభవం కోల్పోయిన టిడిపి నుంచి సీనియర్ లీడర్లు దాదాపుగా వెళ్లిపోయారు. మిగిలిన కొద్ది మంది కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదు. అంటే తెలంగాణలో పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం.అయినప్పటికీ జాతీయ పార్టీగా కూడా చెప్పుకుంటున్న టీడీపీ తెలంగాణలో తన తన మార్కు చూపెట్టడానికి ఆరాటపడుతోంది.కానీ గత ఆరేళ్లుగా తెలంగాణ టీడిపి చీఫ్ గా ఉన్న రమణ వల్ల పార్టీ పుంజుకున్నది లేదన్నది నిర్వివాదాంశం.అయినప్పటికీ ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించటం పార్టీ వర్గాలకు నచ్చలేదు. యువరక్తాన్ని పార్టీ లో నింపాలని పలువురు టీడీపీ నేతలు సూచించినప్పటికీ చంద్రబాబు రమణ వైపే మొగ్గు చూపారు.
ఆంధ్రప్రదేశ్లో ముందుగా కళా వెంకట్రావును తాజాగా అచ్చెన్నాయుడును పార్టీ అధ్యక్షులను చేసిన చంద్రబాబు తెలంగాణలో రమణను కొనసాగించారు. అచ్చెన్నాయుడు విషయంలో ఆంధ్రప్రదేశ్లో టిడిపి శ్రేణులు సానుకూలంగా ఉన్నాయి.ఆయన ఆ పదవికి తగిన వారేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.కానీ తెలంగాణలో మాత్రం రమణకు టిడిపి వర్గాల నుండి వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి!