2019 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి పార్టీ గెలిచిన అతి తక్కువ స్థానాలలో గన్నవరం నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ జగన్ వెవ్ ను తట్టుకుని మరీ గెలవడం జరిగింది. అయితే వైఎస్ జగన్ భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి పదవి అధిరోహించడంతో ఏపీలో రాజకీయా లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. వల్లభనేని వంశీ వైసీపీ పార్టీకి మద్దతు తెలపడంతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి దిక్కు లేని పరిస్థితి నెలకొంది.
అంతేకాకుండా వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వైసీపీలో అధికారికంగా చలామణి అవుతూ చంద్రబాబు నాయుడు ని బూతులు తిట్టడంతో పాటు అనేక రీతులుగా విమర్శలు చాలా సార్లు చేయడంతో గన్నవరం నియోజకవర్గాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. వంశీకి ఎలాగైనా చెక్ పెట్టాలని భావించి అతన్ని ఎదుర్కొనే దీటుగాడు పెద్ద తురుము లాంటి పొలిటిషన్ ని చంద్రబాబు అమెరికా నుండి దింపాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అమెరికాలో తానాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆ ముఖ్య సభ్యులు త్వరలో గన్నవరం నియోజకవర్గం లో అడుగుపెట్టి టిడిపి ఇన్చార్జిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు అట. గతంలో గన్నవరం ఇన్చార్జి విషయంలో గద్దె అనురాధ మరికొంత మంది నాయకుల పేర్లు వినబడ్డాయి. అంతేకాకుండా ఒక బీసీ నాయకుడి కి చంద్రబాబు అప్పట్లో ఈ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మాత్రం ఈసారి కమ్మ నేత అదేవిధంగా అమెరికాలో తానాలో కీలకంగా రాణించిన వ్యక్తిని వంశి పై చంద్రబాబు వదల బొతున్నట్లు అంతే కాకుండా సరైన స్కెచ్ తో చంద్రబాబు రెడీ అయినట్లు టాక్.