అధికారంలో ఉన్న సమయంలో అనేక విషయాలలో చంద్రబాబు యూ టర్న్ తీసుకోవడం జరిగింది. ఏ విషయంపై కూడా స్పష్టమైన వైఖరి అవలంబించ కుండా బాబు వ్యవహరించిన తీరు 2019 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన అనేక హామీల విషయంలో మాట మారుస్తూ ప్రత్యేక హోదా విషయంలో… వచ్చినా పెద్దగా అభివృద్ధి జరిగిన పరిస్థితి ఎక్కడా లేదని, తర్వాత స్పెషల్ స్టేటస్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని… బాబు మార్చిన మాటలకు సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు గట్టిగా ఓటుతో బుద్ధి చెప్పడం జరిగింది.
అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఆ రీతిగానే చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే మొన్ననే కేంద్రం రైతులకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లు విషయంలో పార్లమెంటులో అదేవిధంగా రాజ్యసభలో టిడిపి మద్దతు తెలపడం జరిగింది. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని టిడిపి నేతలు రైతుల బిల్ ని సపోర్ట్ చేయడం జరిగింది. పంట పండించిన రైతు అమ్ముకునే విధంగా ఈ బిల్లు ఉండటంతో ఇది రైతులను బానిస సంకెళ్ళ నుండి విడిపించిన బిల్లు అంటూ తెగ పొగిడారు.
ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ… అధికార పార్టీ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ… కేంద్రం తెచ్చిన రైతాంగం బిల్ కి ఎలా మద్దతు తెలిపిందని ప్రశ్నించడం తో బాబు యూటర్న్ రాజకీయాలు అంటూ టీడీపీ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మొన్ననే కేంద్రం తీసుకొచ్చిన రైతుల బిల్లుకి మద్దతు తెలిపి ఇప్పుడు కేంద్రం పై వ్యతిరేకత పెరుగుతుందని చంద్రబాబు ఈవిషయంలో పొలిటికల్ మైలేజీ సంపాదించడానికి ఆరాటపడుతున్నారని టీడీపీ ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.