ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు నియోజక వర్గాలను జిల్లాలు గా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దిశగా ముందుగానే వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఇన్చార్జిల ను నియమించడం జరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములా నీ చంద్రబాబు ఫాలో అవుతున్నారు. ఈ తరుణంలో ఇటీవల ఇంచార్జు లను ప్రకటించిన చంద్రబాబు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సరికొత్త ఎత్తుగడ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ పార్లమెంట్ ఇంచార్జిగా ప్రకటించిన నెట్టెం రఘురాం పేరుపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు పార్టీలకు పదేళ్లుగా దూరంగా ఉంటున్నారు. 2009 తర్వాత ఎన్నికలలో పోటీ చేయలేదు. అలాంటి నెట్టెం రఘురాంను సడెన్ గా తెర పైకి చంద్రబాబు తీసుకు రావటం టిడిపి వర్గాలను ఆశ్చర్యపరిచినట్లు టాక్. నెట్టెం రఘురాం కృష్ణా జిల్లా నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించారు. మంత్రిగా కూడా పని చేయడం జరిగింది. 1999 ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు.
అలాంటి నాయకుడు నీ పిలిచి చంద్రబాబు ఇన్చార్జిగా ప్రకటించడంతో ఆయన ఎందుకు తీసుకున్నారు అని తెగ డిస్కషన్ లు చేసుకుంటున్నారట. విజయవాడ లోక్సభ స్థానం అంటే తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి ఉంటుంది. అందుకే చంద్రబాబు స్పెషల్ గా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ స్థానాన్ని గత రెండు పర్యాయాలుగా టిడిపి గెలుస్తూ వస్తోంది. కేసినేని నాని రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కేశినేని నాని పార్టీకి వ్యతిరేకంగా అన్నట్టుగా విమర్శలు చేసే తరహా రీతిలో వ్యవహరించడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేకుండా సమస్యలను సరైన రీతిలో పరిష్కరించే విధంగా నెట్టెం రఘురాం ఎన్నికని చంద్రబాబు కన్ఫర్మ్ చేసినట్లు టాక్. ఈ నియోజకవర్గం ఇన్చార్జి విషయంలో దేవినేని ఉమా, కేశినేని నాని పేర్లను ముందుగా పరిశీలించిన గాని చివరాఖరికి నెట్టెం రఘురాంకె చంద్రబాబు మొగ్గుచూపినట్లు వార్తలు వస్తున్నాయి.