తన కలల రాజధాని అమరావతి విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదు అన్నట్టుగా చంద్రబాబు ముందు నుండి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాలలో మూడు రాజధానుల నిర్ణయం నికి ప్రజలు సముఖంగా ఉన్నాగాని చంద్రబాబు మాత్రం అమరావతినే రాజధానిగా గుర్తించాలి అన్నట్టుగా బలంగా ఫిక్స్ అయిపోయారు. తన హయాంలోనే శాశ్వత రాజధానిగా చేయాలని అనేక రీతులలో పలు భవనాలు నిర్మించడానికి ప్రయత్నించారు కానీ అది చివరి వరకు సాధ్యపడలేదు.
ఆ తర్వాత జరిగే ఎన్నికలలో గెలవటం గ్యారెంటీ అనుకున్నా చంద్రబాబుకి అది సాధ్యం కాలేదు. దీంతో అధికారంలోకి వచ్చిన ఏపీ విశాఖ నువ్వు పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో పాటు అక్కడ రాజధాని పనులు చేపడుతోంది. పరిస్థితి ఇలా ఉండగా ఎలాగైనా 3 రాజధానుల వ్యవహారాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న, న్యాయస్థానానికి వెళ్లి మరి అడ్డుకునే ప్రయత్నాలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే అమరావతి ఉద్యమం హైలెట్ అయ్యే విధంగా చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే చంద్రబాబు అమరావతి కి మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కార్యక్రమాలు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు, టిడిపి క్యాడర్ తో జిల్లాల వారీగా యాత్రలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిని ఓ సెంటిమెంట్ గా ఏపీలో క్రియేట్ చేసే రీతిలో చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు టాక్ వస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?