2019 ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ ఫలితాలు రావడంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం పార్టీని ముందుకు నడిపించడానికి నానా తిప్పలు పడుతున్నారు. పైగా వయసు మీద పడటంతో పాటు పార్టీలో ఉన్న కీలక నాయకులు చాలామంది జంప్ అవుతున్న తరుణంలో మిగతావారిలో అభద్రత భావం ఏర్పడింది. దీంతో దాదాపు అధికారం కోల్పోయాక ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు సంస్థాగత మార్పులు చేయడానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశం ఉండటంతో ఆ రీతిగానే అధ్యక్షులను నియమించారు.
అయితే మొదటి నుండి టిడిపి పార్టీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలకు ఇటీవల అధికారంలో ఉన్న జగన్ పెద్ద పీట వేస్తూ సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఉండటంతో చాలా వరకు బిసీ వర్గలు జగన్ వైపు మళ్లుతున్నాట్లూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఇప్పుడు తేరుకున్నట్లు ఈ పార్టీకి కంచు’కోటగా ఉండే బీసీ ఓటు బ్యాంకు జారిపోకుండా తాజాగా నియమించిన పార్టీ కొత్త అధ్యక్షులలో వారికే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.
దాదాపు 25 అధ్యక్ష పదవులలో 10 బీసీలకు చంద్రబాబు కేటాయించడం జరిగింది. దీంతో చంద్రబాబు పార్టీకి అండగా ఉండే బీసీలను ఏమాత్రం వదులుకోకుండా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, కమ్మ సామాజిక వర్గానికి 5 అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి 3, వైశ్య వర్గానికి ఒకటి నియోజకవర్గ అధ్యక్ష స్థానాలను కేటాయించారు. మొత్తంమీద చూసుకుంటే సుమారు 50 శాతం పదవులను బీసీలకు చంద్రబాబు కేటాయించడం జరిగింది. ఇదే రీతిలో కాపులకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు టిడిపి అధిష్ఠానం తెలిపింది.