ఢిల్లీ పోలీసులు జెఎన్యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ నాయకుడు కన్నయ్య కుమార్పై దేశద్రోహం నేరం కింద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మూడేళ్ల క్రితం ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్లో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 1200 పేజీల అభియోగ పత్రాన్ని పాటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేశారు. ఈ వార్త తెలియగానే కన్నయ్య కుమార్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
మూడేళ్ల తర్వాత ఎన్నికల ముందు ఛార్జ్షీట్ దాఖలు చేశారంటే వారి ఆంతర్యం తెలిసిపోతూనే ఉందని సిపిఐకి చెందిన కన్నయ్య కుమార్ వ్యాఖ్యానించారు. కన్నయ్యతో పాటు అప్పటి అతని సహచరులు ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్యపై కూడా అభియోగాలు మోపారు. సిపిఐ నాయకుడు డి. రాజా కుమార్తె అపరాజితతో పాటు ఎఫ్ఐఆర్లో ఉన్న మరో 36 మంది నేరం చేశారనడానికి రుజువులు దొరకలేదని పోలీసులు పేర్కొన్నారు.
పార్లమెంట్పై దాడి కేసులో అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని నిరసిస్తూ మూడేళ్ల క్రితం జెఎన్యు క్యాంపస్లో కన్నయ్య కుమార్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. అక్కడ ఇండియా వ్యతిరేక నినాదాలు ఇచ్చారన్నది పోలీసుల అభియోగం. ఈ వివాదంలో ఢిల్లీ పోలీసుల వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. కన్నయ్య కుమార్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు.
పోలీసులు 1200 పేజీల ఛార్జ్షీట్ను ఒక ట్రంకు పెట్టెలో పాటియాలా హౌస్ కోర్టుకు తీసుకువచ్చారు. ఐపిసి సెక్షన్లు 124ఎ, 323, 465, 471, 143, 149, 147, 120బి కింద ఛార్జ్షీట్ నమోదు చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?