ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కి పుట్టినిల్లు చైనా… భారత్ పై ఉన్న కొద్ది రెచ్చిపోతుంది. వాస్తవానికి కరోనా వైరస్ ప్రపంచంలోకి చైనా వదలడానికి బలమైన రెండు టార్గెట్ లు మొదటిది అమెరికా, రెండవది ఇండియా. కారణం చూస్తే రెండు దేశాలు ప్రపంచంలో అన్ని దేశాల కంటే అభివృద్ధి చెందడమే అని అందువల్లే చైనా కుట్రపూరితంగా…. మహమ్మారిని ప్రపంచంలోకి సీక్రెట్ గా రిలీజ్ చేసినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే కరోనా వైరస్ విషయంలో భారత్ అద్భుతంగా ఎదుర్కోవడంతో చైనా ఇప్పుడు డైరెక్ట్ యుద్ధానికి తలపడటానికి సిద్ధమవుతున్నట్లు గత కొన్ని నెలల నుండి భారత్-చైనా సరిహద్దు వద్ద జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. జూన్ 15వ తారీకు “గాల్వాన్ లోయ” ప్రాంతం వద్ద భారత సైన్యానికి చెందిన 20 మందిని పొట్టనబెట్టుకోవడం తో… వెంటనే భారత్ – చైనా యాప్ లను నిషేధిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో సరిహద్దు వద్ద అనేక కుట్రలకు ట్రై చేస్తున్న చైనా తాజాగా ఆన్లైన్ గేమ్స్ పేరిట నిధులు మళ్లీస్తున్నట్లు NIA గుర్తించింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిసిఎస్ లో చైనా యాప్స్ పై కేసు నమోదు అయింది. ఈ కార్యకలాపాల వెనకాల ఉగ్రవాద కుట్రకోణం ఉందన్న అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. రెండు వేల కోట్లకు పైగా చైనాకు నగదు మళ్లించినట్లు గుర్తించారు. ఇప్పటికే చైనా యాప్స్ పై వీటితోపాటు ఐటీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాక తాజా పరిణామంతో చైనా యాప్స్ పై విచారణ చేయడానికి రంగంలోకి NIA దిగడంతో ఈ విషయం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కుట్ర వెనకాల పాకిస్థాన్ హస్తం కూడా ఉంది అనే ఈ కోణంలో కూడా NIA దర్యాప్తు చేస్తున్నట్లు టాక్.