Chiranjeevi : జనసేన పార్టీ కీలక నాయకుడు నాదెండ్లమనోహర్ మెగాస్టార్ చిరంజీవి పార్టీలో జాయిన్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన క్రియాశీలక సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి కలిసి రాజకీయాల్లో పని చేయనున్నట్లు స్పష్టం చేశారు.
రాజకీయాల్లో తమ్ముడికి అండగా ఉండటానికి చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనోహర్ తెలిపారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఈ సందర్భంలో విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గరపడ్డాయని నియంత పాలన సాగుతోందని డైలాగులు వేశారు. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలు చేసుకోండని ప్రభుత్వం బెదిరిస్తోంది అంటూ ఆరోపించారు.
జనసేన పార్టీ ఏకగ్రీవవాలకు పూర్తి విరుద్ధమని స్వచ్ఛమైన రాజకీయాలు చేయటం జనసేన యొక్క సిద్ధాంతమని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని పంచాయతీ ఎన్నికల్లో యువత పోటీకి దిగ్గాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే చిరంజీవి మొదటిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటం అందరికి తెలిసిందే. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కేంద్ర పర్యాటక మంత్రిగా యూపీఏ హయాంలో పని చేసి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే వార్త రావటంతో మెగా అభిమానుల్లో జోష్ నెలకొంది.